బంగారంతో కరోనాకు చెక్.. మనోళ్లు సూపర్‌?

కరోనా పై పోరులో బంగారం కూడా కీలకపాత్ర వహిస్తుందని చెబుతున్నారు. కరోనా పై పోరులో ఈ బంగారం, సిలికాన్, రాగి ఉపయోగపడతాయని తాజా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పదార్థాలు వైరస్ లోని స్పైక్ ప్రోటీన్ ని బంధించేస్తాయని వాళ్ళు వివరించారు. వీటిని నాశనం చేయడానికి విద్యుత్ క్షేత్రాన్ని ఉపయోగించవచ్చని చెప్పారు. మానవ కణాల్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగించడానికి వైరస్ ఆ స్పైక్ ప్రోటీన్ ను ఉపయోగించుకుంటుందని, కొన్ని రకాల ఉపరితలాలపై ఇవి చిక్కుకుపోతాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

ఈ సందర్భంలో ఈ పదార్థాలను ఎయిర్ ఫిల్టర్స్ లోనూ, బల్లలూ, గోడలూ, ఫేస్ మాస్కులపై పూతగా వాడితే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయచ్చు అని తెలిపారు. స్పైక్ ప్రోటీన్ గుండా కరెంట్ ప్రవహిస్తుందని, అందుకని విద్యుత్ సాయంతో దీన్ని గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆధారం చేసుకుని భవిష్యత్తులో ఒక ఎలక్ట్రానిక్ సాధనాన్ని, ఒక వ్యక్తి ముక్కులోకి ప్రవేశపెట్టి అతనిలో కరోనా వైరస్ ని గుర్తించవచ్చు అని చెప్పారు.

పాతకాలంలో పిల్లలకు బంగారు రాగి తో తయారు చేసిన కంకణాలు మెడకీ, కాళ్ళకు వేసేవారు. అంటే ఈరోజు శాస్త్ర పరిజ్ఞానం పెరగకముందే మనవాళ్ళకి ఏనాడో వీటిపై అవగాహన ఉంది. కానీ  మాస్కులకి పూతలు లాంటివి మొదలు పెడుతున్నారు కానీ ఆ రోజుల్లోనే ఇలాంటి రోగనిరోధక శక్తికి సంబంధించిన ఆలోచనలు ఉన్నాయి. అట్లాగే మంచినీళ్లు రాగి చెంబుల్లో తాగేవాళ్ళం ఆ రోజుల్లో.  దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా మనవాళ్ళకి ఎంత ముందస్తు పరిజ్ఞానం ఉందో అనేటువంటిది.

కాకపోతే భారతీయ సాంప్రదాయాలు అనేటువంటి దాన్ని సైన్స్ తో కలిపి కనుక పరిశోధనలు చేసి ఉంటే, ఆ బ్రిటిష్ వారు నిజంగా  బుద్ధిమంతుడైతే అప్పుడే ఆ పని చేసి ఉండేవాడు. కానీ మనల్ని మూర్ఖులుగా చూపించే ప్రయత్నంలో వాటిని వెటకారం చేశాడన్న వాదన ఉంది.. ఇప్పుడు వాళ్ళ దేశానికి వెళ్లి మన పద్ధతినే ఫాలో అవుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: