బంగ్లాదేశ్ లో హిందువుల దుర్గతి ఇంత దారుణమా?

బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి బానిస బ్రతుకే అవుతుంది. మొన్న 14 దేవాలయాలు కూలిస్తే కనీసం ఈరోజు వరకు  ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలేదు. స్పష్టంగా ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అది. 1947లో స్వాతంత్రం వచ్చేనాటికి అది భారత్ లో భాగం. 1901 నాటికి అక్కడ 33 శాతం హిందువులు ఉండేవారు. అది ఇప్పుడు 7.9 శాతానికి పడిపోయింది. 1971 నాటికి 21 శాతం మంది హిందువులు ఉంటే అది ఇప్పుడు 7.9 శాతానికి పడిపోయింది. 14 ఆలయాలు కూల్చారు, 27 విగ్రహాలు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసింది బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ జమాతే ఇస్లాం పాకిస్తాన్ అనుబంధపు వర్గం వారే.

పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ను విడ గొట్టడాన్ని వ్యతిరేకించేవాళ్ళలో ముఖ్యంగా తానీక్ రెహమాన్ ఒకడు.  దేవుళ్ళ విగ్రహాలు అశ్లీలతకు సాక్ష్యాలు అని వాగేటువంటి దుర్మార్గుడని చెబుతారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ 2021 లో దుర్గా పూజ సందర్భంగా విధ్వంసం సృష్టించి ఏడుగురిని చంపేశాడు . అలాగే గత నెలలో కూడా విధ్వంసం సృష్టించి ఏడుగురిని చంపేశాడు. హిందూ ఫ్రీ చేస్తానంటూ ఒక ఏరియాలో ఉన్నటువంటి ఒక స్వీట్ షాపును ధ్వంసం చేసి ఆ  ప్రాంతంలో ఇలాగే హిందువుల మీద దాడులు చేస్తుంటే అదేంటి అని అడిగినందుకు హిందువులందరినీ ఆ ప్రాంతంలో తుద ముట్టించినోడు.

సోషల్ మీడియాలో కూడా దారుణమైనటువంటి పోస్టులు పెట్టి రెచ్చగొడుతూ ఉంటాడు. చివరికి 21 మందిని ఈ మధ్యనే బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా దాన్నే ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నాడు. గత మూడు నెలలులో అక్కడ  154 మంది హిందువులు చనిపోయారు, 62 మంది మాయమయ్యారు, 39 మంది రేప్ కు గురయ్యారు.  421 మందికి గాయాలవ్వగా, 849 మంది పై బెదిరింపులకు పాల్పడినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కేసులు రిజిస్ట్రేషన్ అయినవి, ఇంకా అవ్వనివి ఎన్ని ఉన్నాయో ఇలాంటివి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: