మోదీ, యోగీ..! భారత్కు వార్నింగ్ ఇస్తున్న అల్ఖైదా?
ముస్లిమేతర ప్రజల్ని వాళ్ళు తమ ముస్లిం మతం లోకి మార్చేది బలవంతంగా అని కూడా కాదు, అది వాళ్లను హత్యలు చేసి మరి మార్చడానికి చేసే విధానం. ఒక కుటుంబాన్ని చంపి మరొక కుటుంబాన్ని తమ మతంలోకి మార్చడం లేదా అదే కుటుంబంలోని అమ్మాయిలను అత్యాచారం చేసి మిగిలిన వాళ్ళని చంపేస్తామని భయపెట్టి వాళ్ళందర్నీ ముస్లిం మతంలోకి మార్చడమో ఇలా ఇంత దారుణంగా జరుగుతుంది వాళ్ళ మత మార్పిడి పద్ధతి. వాళ్లు ఈ పద్ధతిని అవలంబిస్తామని అఫీషియల్గా తమ పత్రికలో కూడా ప్రకటించారు.
బంగ్లాదేశ్ లో.. ఆఫ్ఘనిస్తాన్ లో, పాకిస్తాన్ లో వాళ్ళు మతమార్పిడి చేయడానికి, తమ మతంలోకి మార్చుకోవడానికి ఏ పద్ధతిని అయితే వాడారో ఇప్పుడు భారతదేశంలో కూడా అదే పద్ధతి వాడి, మారని వాళ్ళను అత్యాచారం చేయడమో లేదంటే చంపడం చేస్తామని వాళ్ళు ఎంతో ధైర్యంగా ప్రకటిస్తున్నారు. వాళ్లు ఈ విధంగా తమ పత్రికల ద్వారా ఉత్తర ప్రదేశ్ మంత్రి యోగి ఆదిత్యనాథ్ కి, భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జరగబోయేది ఏంటో హెచ్చరిస్తున్నారు. మరోపక్క పాకిస్తాన్ అనవసరంగా కాశ్మీర్ లో ఈ మధ్యన తీవ్రవాదాన్ని పెంచడం లేదు, పాకిస్తాన్ సమరయోధుల పేరుతో పాకిస్తాన్ తన ప్రభావాన్ని తగ్గించేసింది అంటూ పాకిస్తాన్ ని కూడా తిట్టి పోసింది.