వైసీపీలో కొత్త మంత్రుల పై పార్టీలో గుసగుస...!
ఇప్పటికే జగన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలోనే ఆయన మంత్రి కూర్పు సమయంలోనే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వచ్చే రెండున్నరేళ్లలో మంత్రి వర్గాన్ని మారు స్తానని చెప్పారు. అయినప్పటికీ.. మంత్రులు మాత్రం ధీమాగా ఉన్నారు. చాలా మంది జగన్కు అత్యంత కావాల్సిన వారు.. కావడం.. వైఎస్ కుటుంబంతో వారికి ఉన్న అనుబంధం వల్ల కావొచ్చు.. మమ్మల్ని తీసేయరు! అనే ధీమాతో చాలా మంది ఉన్నారు.
అదే సమయంలో వైఎస్ కుటుంబంతో నేరుగా సంబంధాలు లేకపోయినా.. ప్రభుత్వం తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్నాం. టీడీపీకి మంచి కౌంటర్లు ఇస్తున్నాం. ప్రభుత్వాన్ని ఇరుకున పడకుండా చూస్తున్నాం.. అనే ఫైర్ బ్రాండ్ మంత్రులు కూడా.. ఆశలు పెట్టుకున్నారు.అంటే.. వీరంతా కూడా ప్రభుత్వంలో ఎన్నిమార్పులు వచ్చినా.. తమకు పదవులు పోవనే ధీమాతో ఉన్నారు. ఇదే విషయం వైసీపీలో చర్చకు వస్తోంది. మానసికంగా .. మంత్రులను సిద్ధం చేసేందుకు జగన్ ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చలు జరిపారు.
అదే సమయంలో కీలక సలహాదారు ను కూడా రంగంలోకి దింపి.. సున్నితంగా ఉన్న మంత్రులకు కూడా చెప్పిస్తున్నారు. అంటే.. ఎలా చూసుకున్నా.. మంత్రులు తమ పదవులు పోయిన తర్వాత.. హర్ట్ కాకుండా.. ఆయా సామాజిక వర్గాల్లో గ్రూపులు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంత్రి పదవులు పోయినా.. మంచి వాల్యూ ఉండే.. పార్టీ పదవులు ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ.. నాయకుల్లో మాత్రం ఎక్కడో తేడా కొడుతోందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి.. జగన్ జోక్యం చేసుకుని.. మంత్రులను మానసికంగా సిద్దం చేయాలని కోరుతున్నారు.