వైసీపీలో ఆ మంత్రి ఆ పార్టీ నేత‌ల‌కే టార్గెట్ అయ్యాడే.. ఏం జ‌రుగుతోంది..!

VUYYURU SUBHASH
ప్ర‌స్తుతం వైసీపీలో మంత్రుల‌కు, చాలా మంది ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య వివాదాలు న‌డుస్తున్నాయి. మంత్రుల వైఖ‌రిని చాలా మంది ఎమ్మెల్యేలు త‌ప్ప‌బ‌డుతున్నారు కూడా. అయిన‌ప్ప‌టికీ.. మంత్రులు మారిపోవ‌డం `ఖాయం కాబ‌ట్టి..` అని అనుకుంటూ.. నాయ‌కులు స‌ర్దుకు పోతున్నారు. పైగా ఈ వివాదాలు.. కేవ‌లం.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యాయి. అయితే.. తాజాగా మంత్రి నారాయ‌ణ‌స్వామి విష‌యంలో మాత్రం నియోజ‌క‌వ‌ర్గాల‌కు అతీతంగా నాయ‌కులు మండిప‌డుతున్నారు. ఆయ‌న‌పై ఒకింత ఆగ్ర‌హంతోనే ఉన్నారు. దీనికి కార‌ణం.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే!

ఇటీవ‌ల అసెంబ్లీలో మంత్రి నారాయ‌ణ స్వామి మాట్లాడుతూ.. జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తుకున్నారు. ఆయ‌న వ‌ల్లే.. మేం గెలిచామ‌ని.. అన్నారు. స‌హ‌జంగా.. వైసీపీలో ఉన్న నాయ‌కులు అంద‌రూ చెప్పేది ఇదే. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రుకూడా ! కానీ, ఇంత‌కు మించి.. అన్న‌ట్టుగా.. నారాయ‌ణ‌స్వామి వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ బిచ్చం వ‌ల్లే.. మేం ఇక్క‌డ‌కు వ‌చ్చాం. అంటూ.. ప‌దే ప‌దే బిచ్చం.. బిచ్చం అని ప‌దిమా ర్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పైనే ఎమ్మెల్యేలు ఆయ‌న‌పై గుస్సాగా ఉన్నారు.

అయితే. ఇక్క‌డ జ‌గ‌న్‌ను వ్య‌తిరేకించ‌డం కాదు.. జ‌గ‌న్‌ను ఎవ‌రూ వ్య‌తిరేకించ‌డం లేదు. కానీ, వారి ఆవేద‌న అంతా కూడా.. కేవ‌లం జ‌గ‌న్‌ను మాత్ర‌మే చూపిస్తే.. త‌మ స‌త్తా లేదా? అనేది వారి బాధ‌. జ‌గ‌న్ ఫొటోను పెట్టుకునే అంద‌రం గెలిచాం. కానీ, కానీ, 23 చోట్ల పార్టీ ఓడిపోయింది క‌దా ! దీనికి ఏం చెబు తారు? అనేది ఎమ్మెల్యేల వాద‌న‌. జ‌గ‌న్ పేరు ఉండాల్సిందే కానీ.. మ‌రి ఇంత‌గా బిచ్చం అనే వ్యాఖ్య‌లు చేయాలా?  మ‌రో రూపంలో జ‌గ‌న్‌ను పొగిడితే త‌ప్పేముంది ? ఇలా చేసి ఉండొచ్చు క‌దా! అంటున్నారు.

అలా వ‌దిలేసి.. కేవ‌లం .. ఇలా బిచ్చం అంటూ వ్యాఖ్యానించ‌డం.. అందునా.. నిండు స‌భ‌లో ఇలా చేయ‌డం ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యంపై ఎమ్మెల్యేల మ‌ధ్య ఆసక్తిక‌ర చ‌ర్చే సాగ‌డం గ‌మ‌నార్హం. మ‌రి మంత్రిమాత్రం త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించుకోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: