వైసీపీ రాష్ట్రాన్ని దున్నేస్తున్నా అక్క‌డ మాత్రం దిక్కూదివాణం లేదు.. లీడ‌రే క‌రువు..!

VUYYURU SUBHASH
వ‌చ్చే ఎన్నిక‌ల‌పై వైసీపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యం కన్నా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే.. పార్టీకి ప్ర‌తిష్ట‌గా మారింది. ఈ నేప‌థ్యంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంపై జ‌గ‌న్ దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. దీనిని మునిసిపాలిటీగా కూడా తీర్చిదిద్దారు. అంతేకాదు.. గ‌త మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. ఇప్పుడు కీల‌క‌మైన స‌మ‌స్య వ‌చ్చింది. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే నాయ‌కుడు వైసీపీకి లేకుండా పోయారు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ చంద్ర‌బాబు చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా కేవ‌లం 30 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. పైగా కొన్ని రౌండ్ల‌లో వెన‌క ప‌డ్డ ఆయ‌న చివ‌ర‌కు ఏదోలా గ‌ట్టెక్కారు. ఇక పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఇక్క‌డ బాగా టార్గెట్ చేసింది. చంద్ర‌బాబు వంటి కీల‌క నేతను ఇంటికి పంపించాల‌ని నిర్ణ‌యిం చుకున్నా.. ఆ రేంజ్‌లో స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌కుడు.. పోటీ చేసేందుకు వైసీపీకి ల‌భించ‌లేదు.

దీంతో ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా కీల‌క‌మైన నాయ‌కుడి కోసం వెతుకుతున్నారు. అంతేకాదు.. ఎవ‌రిని ఎంచుకున్నా.. ఆర్ధికంగా.. సామాజికంగా కూడా చంద్ర‌బాబును ఢీ కొట్టే లా ఉండాల‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుపై పోటీ చేసే నాయ‌కుడిని అన్వేషించే బాధ్య‌త‌ల‌ను పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో పాటు ఎంపీ రెడ్డ‌ప్ప‌కు కూడా అప్ప‌గించార‌ట‌. దీంతో ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో స‌మావేశాలు పెట్టారు. కీల‌క మైన నాయ‌కుడు కావాలంటూ  ప్ర‌చారం కూడా చేస్తున్నారు. ఈ ప్ర‌చారం ఓ రేంజ్ లో న‌డుస్తోంది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ల‌భించ‌లేదు. ఈ నేప‌థ్యంలో సినీ న‌టుడుని ఎంపిక‌చేసి.. నిల‌బెడితే.. బాగుంటుంద‌నే భావ‌న వ్య‌క్త‌మవుతోంది. అయితే.. ఇక్క‌డ పోటీ చేసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. అయితే.. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి.. వెతికే ప‌నిలో ఉన్నార‌ని అంటున్నారు. మ‌రి ఎవ‌రిని నిల‌బెడ‌తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: