ఆ వైసీపీ ఎమ్మెల్యే కనపడడం లేదు.. నియోజకవర్గంలో ఫ్లెక్సీలు...!
మొదట్లో.. కరోనా అంటూ.. అసలు నియోజవకర్గం మొహం చూడలేదు. కేవలం బెంగళూరు, హైదరాబా ద్కే పరిమితమయ్యారు. వాస్తవానికి ఆయనకరోనా అని చెప్పినా.. వాస్తవానికి ఆయన తన వ్యాపారాల కోసమే.. ఇలా చేస్తున్నారని.. పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎట్టకేలకు.. కరోనా తగ్గింది. దీంతో ఎమ్మెల్యే తమకు అందుబాటులో ఉంటారని.. ఇక్కడి ప్రజలు భావించారు. కానీ, ఇంతలోనే.. కుటుంబంలో వివాహం ఉందని.. పేర్కొంటూ.. మరో ఆరు మాసాలు.. నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీంతో పుణ్యకాలం కాస్తా.. మూడేళ్లు గడిచిపోయింది.
మరి ఇప్పుడైనా.. ఆయన అందుబాటులో ఉంటున్నారా ? అంటే.. అది కూడా కనిపించడం లేదు. కేవలం విజిటింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి రావడం.. తన పీయేలను పురమాయించడం.. వంటివి మాత్రమే చేస్తున్నారు. పలితంగా ప్రజలకు ఎమ్మెల్యేతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయట. ఇదే విషయాన్ని పేర్కొంటూ.. నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిశాయట. ప్రస్తుతం జిల్లాల విభజన జరుగుతోంది. ఈ సమయంలో తమ డిమాండ్లు చెప్పుకొనేందుకు.. ప్రజలు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఎమ్మెల్యే అందుబాటులో లేక పోవడంతో పీయేలకు మాత్రమే వినతి పత్రాలు ఇస్తున్నారట.
ఎన్నికలు మరో రెండేళ్లు కూడా లేవు. ఈ టైంలో కూడా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు కేడర్కు అందు బాటులో లేకపోతే ఎలా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఆయన ఇప్పటికైనా మేల్కొంటారా? లేదో చూడాలి. ఇదే పద్ధతి కొనసాగితే.. ఎమ్మెల్యేను ఓడించడం ఖాయమనే వాదనవినిపిస్తుండడం గమనార్హం. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.