ఇలా చేస్తే వైసీపీకి దెబ్బడిపోద్దా....జగన్ చూస్తున్నావా ?
మరోవైపు.. టీడీపీ సభ్యులు కోరుతున్నది ఏంటి? గడిచిన ఐదు రోజులుగా గమనిస్తే.. జంగారెడ్డి గూడెంలో జరిగిన సారా మరణాలపై.. సభ్యులు నిలదీస్తున్నారు.దీనిపైనే చర్చకు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో రోజూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం కోరుతున్నారు. దీనిపై ఒక్క పూట కేటాయిస్తే.. సభలో చర్చకు అనుమతిస్తే.. అయిపోతుంది కదా.. ! ఈ విషయంలో ప్రభుత్వం తరఫున కూడా తన వాదన వినిపించేందుకు అవకాశం ఉంటుంది కదా.. ! అంటున్నారు మేధావులు.
అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారనే వాదన కూడా ఉంటుందని అంటున్నారు. కానీ, ఇలా సస్పెన్షన్ల పర్వం కొనసాగిస్తే.. సహజంగానే టీడీపీ ప్రజల్లోకి వస్తుంది. తద్వారా.. వైసీపీ పైనే మర కలు పడతాయి. ఇదే జరిగితే టీడీపీకి మాంచి సానుభూతి వస్తుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఈ చర్యల వల్లే జగన్ ప్రజల్లోకి రావడంతో మంచి మైలేజ్ వచ్చింది. ఇప్పుడు వైసీపీ కూడా అదే తప్పు చేస్తోన్న పరిస్థితి.
అదేదో సభలోనే ఉండి చర్చించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే.. ఎంత బాగుంటుంద ని... అంటున్నారు పరిశీలకులు. కనీసం ఇప్పటికైనా..ప్రభుత్వ పక్షం టీడీపీ నేతలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాదు.. గతంలో వైసీపీ కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే ఉద్దేశంతో ఎంతగా ఇబ్బంది పడిందో కూడా గుర్తించాలని మేధావులు సైతం చెబుతున్నారు. కానీ, ఇప్పుడు కూడా ఇలానే వ్యవహరిస్తే.. సాధించేది ఏంటనిఅంటున్నారు. మరి వైసీపీ నాయకులు మారతారో లేదో చూడాలి.