టీడీపీలో డిపాజిట్లు రాని నేత‌కు వైసీపీలో ఎమ్మెల్సీ ఆఫ‌ర్ ?

VUYYURU SUBHASH
ఆయ‌న యువ నేత‌, పార్టీలో పుంజుకుంటే.. బ‌ల‌మైన అండ దొరుకుతుంది. పార్టీలోనూ మంచి పేరు వ స్తుంది. దీనికి తోడు బ‌ల‌మైన ఫ్యూచ‌ర్ కూడా క‌నిపిస్తోంది. అయితే.. ఆయ‌న మాత్రం ఇంటికే ప‌రిమిత‌మ వుతున్నారు. ఎప్పుడో ఒక‌సారి మాత్రమే తెర‌మీదికి వ‌స్తున్నారు. వ‌చ్చ‌నా... పెద్దగా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. దీంతో ఈ యువ‌నేత విష‌యం.. ఇటు పార్టీలోనూ.. అటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ..చ‌ర్చ‌కు దారి తీసిం ది. ఆయ‌నే యువ నాయ‌కుడు, ఉన్న‌త విద్యావంతుడు కిడారి శ్రావ‌ణ్‌కుమార్‌.

అనూహ్యంగా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన శ్రావ‌ణ్‌.. టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌విని కూడా సొంతం చేసుకున్నారు. అయితే.. ఎన్నిక‌ల‌కు కేవ‌లం 6 మాసాల ముందు మాత్రమే.. ఇవ‌న్నీ జ‌రిగాయి. ఇక‌, ఎన్ని కల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే.. దీనికి ముందు జ‌రిగిన త‌న తండ్రి హ‌త్య‌ను ఈయ‌న రాజ‌కీ యంగా వినియోగించుకోలేక పోయార‌నే వాద‌న ఉంది. అదేస‌మ‌యంలో పార్టీలు మారిన నేప‌థ్యంలో గిరి జ‌నుల‌ను కూడా ఆయ‌న అప్ప‌ట్లో మెప్పించ‌లేక పోయారు. ఇదే అప్ప‌ట్లో ఆయ‌న‌కు క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌కుండా చేసింద‌ని అంటారు.

అయితే.. మ‌ర అప్ప‌టి న‌నుంచి ఆయ‌న పుంజుకున్న‌ది ఏమైనా ఉందా? అంటే.. ఏమీ క‌నిపించ‌డం లేదు . టీడీపీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నా..యాక్టివ్‌గా ముందుకు రావ‌డం లేదు. అంతేకాదు... యువ‌త ను కూడా ఆయన స‌మీక‌రించ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌డం లేదు. అదేమంటే.. త‌న‌కు ఇంకా కొత్తే అనే మాట వినిపిస్తున్నార‌ట‌. అంతేకాదు... వైసీపీ నేత‌ల నుంచి ఆయ‌న‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌నే  చ‌ర్చ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. పార్టీ మారితే.. ఎమ్మెల్సీ ఇస్తామ‌ని కూడా ఆఫ‌ర్లు ఇస్తున్న‌ట్టు కిడారి వ‌ర్గం పేర్కొంటోంది. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌నేది తేలాల్సి ఉంది. ఏదేమైనా.. ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న నాయ‌కుడు ఇలా.. బ‌య‌ట‌కు రాకుండా.. టీడీపీలో ఉండ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తే.. రేపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిస్థితి ఏంట‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: