హెరాల్డ్ ఎడిటోరియల్ : టిడిపికి చివరి రోజులు వచ్చేసినట్లేనా ? ఎల్లోమీడియా చెప్పిందిదేనా ?
అంటే జగన్ పై పోరాటం చేయటానికి చంద్రబాబుకు ఎటువంటి అంశాలు అక్కరకు రావటం లేదు. జగన్ పై ప్రయోగిస్తున్న అస్త్రాలేవి పనిచేయటం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోరపరాజయం దెబ్బకు ఏమి చేయాలో చంద్రబాబుకు దిక్కుతోచటం లేదు. దానిమీద జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనతో పార్టీ రాష్ట్రం మొత్తం కుదేలైపోయింది. అసలే మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రలో తుడిచిపెట్టుకుపోయిన పార్టీ మీద జగన్ ప్రతిపాదన మూలిగే నక్కపై తాటిపండు పటినట్లైంది. అప్పటి నుండి జగన్ను రాజకీయంగా ఎలా దెబ్బ కొట్టాలా ? ఆలోచనతో చంద్రబాబు ఎన్ని మాయలు చేస్తున్న ఫలించటం లేదు. అందుకనే చివరి అస్త్రంగా చంద్రబాబు హిందుమతం ఉద్దారకుని అవతారమెత్తారు. సరే ఇది కూడా ఫలించలేదనుకోండి అది వేరే సంగతి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ సహకారంతోనే హిందుత్వ ఎజండాను రాష్ట్రంలో విస్తరింపచేయాలన్నది బిజెపి వ్యూహంగా అనుకుంటున్నట్లు ఎల్లోమీడియా బయటపెట్టింది. ఇక్కడ తన మనసులోని ఆలోచనను అందరిపైనా ఎల్లోమీడియా రద్దుతోంది. ఏ ముఖ్యమంత్రయినా తనంతట తానుగా మరో ప్రతిపక్షం బలపడేందుకు ఊతమిస్తాడా ? అన్నది సింపుల్ లాజిక్. నిజానికి రాష్ట్రంలో బిజెపికి ఉన్నదేమీ లేదు కొత్తగా పోవటానికి. గట్టిగా చెప్పాలంటే 175 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను కూడా పోటికి పెట్టేస్ధితిలో లేదు బిజెపి. ఇటువంటి బిజెపితో హిందుత్వ ఎజండాను అమలు చేసేందుకు జగన్ ఎందుకు చేతులు కలుపుతాడు ?