ఓటు బదిలీ హుళక్కే.. భారీ ఓటమి దిశగా కూటమి?
ఇప్పుడిదే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. ఏది అయితే అది అవుతుందని తాంబూలాలు తీసేసుకొని ఎన్నికల కదన రంగంలోకి అడుగు పెట్టిన ఈ మూడు పార్టీలకు అక్కడక్కడా ఆ పార్టీ నాయకులు చుక్కలు చూపించారు. అప్పటి వరకు పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం.. స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం చేసుకోవడం.. వంటి కారణాలతో కూటమి నేతల మధ్య ఐక్యత దెబ్బతింది.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా.. చూడడమే ఇప్పుడు ముఖ్యం. ఇదే సమయంలో కూటమి పార్టీల్లో ఓట్లు బదలాయింపు కూడా జరగాలి. ఈ రెండు కీలక అంశాలే. ఇప్పుడివే కూటమికి పరీక్ష పెడుతున్నాయి. నిజంగా చెప్పాలంటే అనుకున్నంత సులభంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు కనిపించడం లేదు. ఈ విషయం ఆయా పార్టీలకు కూడా తెలుసు. ఇప్పటకీ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు స్థానకంగా ఎడమెహం, పెడ మోహంగానే ఉన్నారు.
దీంతో పరిస్థితి మిశ్రమంగా మారింది. సీటు దక్కని వారు అసంతృప్తిలో ఉన్నారు. ఉదాహరణకు తీసుకుంటే తిరుపతి, నూజివీడు, పి.గన్నవరం, ఎచ్చర్ల, శ్రీకాకుళం, చీపురుపల్లి వంటి అనేక నియోజకవర్గాల్లో సుమారు 50 స్థానాల వరకు నాయకుల మధ్య కలివిడి లేదని టాక్ నడుస్తోంది. ఇది కూటమిలో ప్రధాన చర్చకు దారి తీస్తోంది. మొత్తం మీద ఏ ఉద్దేశం మీద ఈ కూటమిని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేరాలా కనిపించడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తం మీద ఈ అంశాలన్నీ వైసీపీకి అనుకూలంగా మారతాయని అంచనా వేస్తున్నారు.