తిట్టిన నోటితోనే: బాబు కష్టం.. పగవాడికి కూడా వద్దు?

Chakravarthi Kalyan
పగవానికి కూడా రాని కష్టం చంద్రబాబుకి వచ్చింది. ఐదేళ్ల క్రితం ఎన్డీయే నుంచి బయటకి వచ్చిన సందర్భంలో మోదీని, బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ధర్మ పోరాట దీక్షల పేరిట జిల్లాకో రూ.కోటి నిధులు మంజూరు చేసి మరీ కేంద్రాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుతల చేత తిట్టించారు. ఈ సమయంలో ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రధాని ఏపీ వస్తుంటే ఎందుకు వస్తున్నారు? సిగ్గుందా అని చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఇప్పడు చాన్నాళ్ల తర్వాత చిలకలూరిపేటలో వేదిక పంచుకున్న చంద్రబాబు మళ్లీ మోదీ భజన మొదలు పెట్టారు. మేకిన్ ఇండియా.. వికసిత్ భారత్, అమృత్ భారత్, ఇలా ఆయన్ను చాలా సేపు కీర్తిస్తూ మాట్లాడారు.  ఈ సందర్భంగా ప్రధానిని పొగుడుతూ .. మోదీ అంటే  ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం అంటూ అభివర్ణించారు. ఆయన ఒక వ్యక్తి కాదు. మోదీ అంటే విశ్వగురువు గా మారుస్తున్న శక్తి.  ఆయన అంటే సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అంటూ ఒకటే భజన చేశారు.

ఈ సందర్భంగా గతంలో ఆయన్ను విమర్శించిన వీడియోను వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు. ఏయ్ మోదీ నువ్వో ఉగ్రవాదివి. నువ్వో టెర్రిస్ట్ వి, నిన్ను ఉరితీయాలి. పెళ్లాన్ని, తల్లిని చూడలేనివారు దేశాన్ని చూస్తారా.. కనీసం నమస్కారం పెట్టినా తిరిగి ప్రతి నమస్కారం పెట్టలేని వ్యక్తి నరేంద్ర మోదీ  అంటూ ఆనాడు  చంద్రబాబు ప్రధాని ని తూర్పార పట్టారు.

కానీ నేడు అదే నోటితో కీర్తిస్తుంటే బీజేపీ క్యాడర్ విస్తుపోయి ఆయన వైపు చూసింది.  అయితే తిట్టిన నోటితోనే కీర్తించబడటం నరేంద్ర మోదీ చేసి చూపించిన ఒక అద్భుతంగా విశ్లేషకులు చెబుతున్నారు.  గత ఎన్నికల్లో దారుణంగా అవమానించిన వ్యక్తే.. ఈ సారి పొగుడుతుంటే బీజేపీ శ్రేణులు ఇది మోదీ సత్తా అంటూ పోస్టులు పెడుతున్నారు. నిజంగా ఇలాంటి ఘనత ఎవరికీ సాధ్యం కాదని.. కేవలం నరేంద్ర మోదీతోనే ఇలాంటివి సాధ్యం అవుతాయని రాసుకొస్తున్నారు. అందుకే నరేంద్ర మోదీ అదృష్టవంతుడు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: