పాక్‌కు అప్పిచ్చి ఆదుకుంటున్న చైనా..?

Chakravarthi Kalyan
అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ అప్పు ఇవ్వలేదు. అరబ్ దేశాలు కూడా మొండి చేయి చూపించాయి. సాయం, అప్పు రెండు విషయాల్లో కేవలం షూరిటీ ఇవ్వడానికి మాత్రమే దుబాయ్ ముందుకొచ్చింది. దుబాయ్ మద్దతివ్వడంపై సౌదీ రాజు దుబాయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య పాకిస్థాన్ గురించి విబేధాలు వచ్చాయి. అయితే అదే సందర్భంలో చైనా కూడా పాకిస్థాన్ ను అప్పు తీర్చాలని అడిగింది. అయితే డ్రాగన్ కంట్రీ తాజాగా తన మనసును మార్చుకుని పాక్ కు అప్పు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.


దాదాపు 2.4 బిలియన్ డాలర్లు అప్పు ఇచ్చేందుకు మళ్లీ చైనా అంగీకారం తెలిపింది. దీంతో షాదాబ్ షరీఫ్ ప్రభుత్వానికి ఊరట కలిగించిన విషయం ఇదేనని తెలుస్తోంది. చివర్లో డబ్బులు మిగిల్చుకుని రాజకీయాల్లో ఖర్చు పెట్టుకోవడానికి కూడా షాబాద్ పార్టీకి పనికొస్తుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న ఈ తరుణంలో చైనా పాక్ కు అండగా నిలవడం వెనక ఏదో పెద్ద కుట్రే దాగి ఉందని తెలుస్తోంది.


ఇప్పటికే పాకిస్థాన్ చైనాకు భారీ మొత్తంలో అప్పులు ఇవ్వాల్సి ఉంది. కానీ అవేవీ పట్టించుకోకుండా పాక్ కు చైనా మళ్లీ భారీ మొత్తంలో సాయం చేయడానికి ముందుకు వస్తోంది. అంతే కాకుండా గతంలో చెల్లించాల్సిన అప్పును కూాడా రెండేళ్ల పాటు ఇవ్వకున్నా పరవాలేదని చెప్పడంతో పాక్ కు అతి పెద్ద సాయం చేసినట్లయింది.


పాక్ కు ఎప్పుడు దోస్తీగా ఉండే దేశాలైన అరబ్ కంట్రీలు మొఖం చాటేసిన తరుణంలో చైనా మాత్రం పెద్ద మనసును చాటుకుంటోంది. అయితే దీని వెనక ఇండియాను దెబ్బకొట్టే ప్లాన్ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియా, పాక్ కు ఏ మాత్రం పడవు. ఇలాంటి  తరుణంలో పాక్ ను పెంచి పోషిస్తేనే ఇండియాను ఎలాగైనా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఆదుకోవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: