కాటేసిన పాముకే షాకీచ్చాడు.. ఏం చేశాడో తెలుసా?

praveen
వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లనైన ఆహ్లాదకరమైన వాతావరనం మాత్రమే కాదు ఇక అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో విషపూరితమైన కీటకాలు ఏకంగా జనావాసాల్లోని పరిసర ప్రాంతాల్లో నక్కి ఉంటూ.. ఇక ఎంతోమందిపై దాడి చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటిని కూడా ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలని ప్రమాదాలను నివారించాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని కొన్ని సార్లు ఇక పాములు లాంటి విషపూరితమైన జీవులు దాడి చేయడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే సాధారణంగా పాములు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎక్కడైనా కనిపించాయి అంటే ఎంత ధైర్యవంతులు అయినా సరే హడలిపోతూ ఉంటారు. పైపైకి తమకు పాములు అంటే భయం లేదు అని చెప్పినప్పటికీ.. లోలోపల మాత్రం ఎందుకో తెలియకుండానే వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఒకవేళ పాము కాటుకు గురైతే వెంటనే ఆసుపత్రికి పరుగులు పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అలా చేయలేదు. పాము కాటు వేస్తే ఏకంగా ఆ పాము పైనే పగ తీర్చుకున్నాడు. ఈ క్రమంలోనే అతను చేసిన పని గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

 తనను కాటేసిన పామును ఒక వ్యక్తి కొరికి చంపేసిన ఘటన బీహార్ లోని రాజౌలి  ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. రైల్వే లైన్ పనిచేస్తున్న కార్మికుడు సంతోష్ ను దురదృష్టవశాత్తు పాము కరిచింది. అయితే ఇది గమనించిన అతను ఏకంగా కాటు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పామును పట్టుకుని మూడుసార్లు కొరకడంతో చివరికి ఆ పాము ప్రాణాలు వదిలింది. అయితే అధికారులు వెంటనే సంతోష్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు   అయితే ఇలా కాటు వేసిన పామును కొరికితే విషానికి విరుగుడు అవుతుందని తమ ఊర్లో నమ్ముతారు అంటూ ఇక సంతోష్ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: