పెంపుడు కుక్కను వీధి కుక్కలు చంపాయని.. అతను చేసిన పనికి.. అందరూ ప్రాణభయంతో వణికి పోయారు?

praveen
ఇటీవల కాలంలో కుక్కలకి మనుషులకి మధ్య బంధం ఎంతలా బలపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మొన్నటి వరకు కుక్కలను కేవలం కాపల కోసం మాత్రమే పెంచుకునేవారు అందరూ. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఏకంగా మంచి బ్రిడ్ ఉన్న కుక్కలను భారీగా ధరపెట్టి కొనుగోలు చేసి మరి ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇక ఇంట్లో మనిషి లాగానే కుక్కలను చూసుకుంటున్నారు. మనుషులనైనా అంత ప్రేమగా చూస్తారో లేదో కానీ కుక్కలపై అమితమైన ప్రేమ చూపిస్తూ ఉండడం నేటి రోజుల్లో కనిపిస్తుంది.

 ఏకంగా మనుషులు తిన్నదానికంటే కుక్కలకే మంచి ఫుడ్ పెడుతున్న డాగ్ లవర్స్ ని కూడా నేటి రోజుల్లో చాలామందిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఇలాగే ఎంతో ప్రేమతో ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. కానీ ఆ కుక్క బయటకు వెళ్ళినప్పుడు దానిపై వీధి కుక్కలు దాడి చేసీ చివరికి దారుణంగా ప్రాణాలు తీసేసాయి. ఇలా పెంపుడు కుక్క చనిపోవడంతో అతను కోపంతో ఊగిపోయాడు. దీంతో మృగంలా మారిపోయాడు. తన పెంపుడు కుక్కను చంపిన 25 కుక్కలను కూడా దారుణంగా చంపేశాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో వెలుగులోకి వచ్చింది.

 పొన్నాకుల గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. దేవుని పల్లికి చెందిన నర్సింహారెడ్డి హైదరాబాద్ రెడ్ హిల్స్ లో ఉంటున్నాడు. అతనికి తారీక్ అహ్మద్, మహమ్మద్ తాహిర్ అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు. కాగా నరసింహారెడ్డి అత్తగారిది అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం. కాగా అత్తగారింట్లో డాక్స్ హుంబ్ జాతి రకం పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయితే ఇటీవల గ్రామంలోని వీధి కుక్కలు ఒక కుక్కను కరవడంతో పాటు మరో దాన్ని గాయపరిచాయి. దీంతో నరసింహారెడ్డి కోపంతో ఊగిపోయాడు. ఇక కారులో స్నేహితులతో కలిసి స్నేహితుడు తారిక్ అహ్మద్ వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీతో గ్రామంలో కనిపించిన కుక్కలు అన్నిటిని కూడా కాల్చేశాడు. కాగా పంచాయతీ కార్యదర్శి విజయరామరాజు ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: