ఓరినాయనో.. 217 సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు.. చివరికి?

praveen
చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకిపోయిన కరోనా వైరస్ ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రశాంతంగా సాగిపోతున్న ప్రపంచాన్ని ఒకేసారి కుదిపేసింది. ఇక ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయాన్ని కలిగించింది. ఇక సామాన్యులు సంపన్నులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇంటిపట్టునే ఉండేలా చేసింది. చివరికి కనిపించని శత్రువుతో ప్రతి ఒక్కరు మాస్క్ అనే ఆయుధాన్ని వాడి పోరాటం చేసే పరిస్థితికి కారణమైంది అని చెప్పాలి.

 ఏకంగా మనుషుల ప్రాణాలు పిట్టల రాలిపోతూ ఉంటే చూస్తూ మా ప్రాణం కూడా ఇలాగే పోతుందేమో అనే ప్రతి ఒక్కరు కూడా భయపడే  పరిస్థితికి కారణమైంది కరోనా వైరస్. అయితే ఆ తర్వాత కాలంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రం క్రమక్రమంగా పరిస్థితులు అదుపులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని దేశాల్లో కూడా ఇలా ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకొని కనిపించని శత్రువుతో పోరాటం సాగించారు. అయితే చాలామంది ఒకటి రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది ఇక బూస్టర్ డోస్ పేరిట మూడో డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు.

 ఇలా ఇప్పటివరకు ఎంతోమంది బూస్టర్ డోస్ వరకు వ్యాక్సిన్లు తీసుకోవడం గురించి విన్నాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా 217 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాడు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా. జర్మనీలో ఈ ఘటన జరిగింది. 62 ఏళ్ళు ఒక వ్యక్తి ఏకంగా 217 వ్యాక్సిన్లు  తీసుకున్నాడు. ఇప్పుడు ఇదే వ్యక్తి సైంటిస్టులకు స్టడీగా కూడా మారిపోయాడు. విషయం తెలిసిన పరిశోధకులు సైతం అవాక్కవుతున్నారు. అతడి రోగ నిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందో తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నారు. అయితే 200 కు పైగా డోసులు తీసుకున్న ఆ వృద్ధుడిలో ఇప్పటికి కూడా వ్యాక్సిన్ వల్ల యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: