అమ్మాయిలు మరీ ఇంత వైలెంట్ అయిపోతున్నారేంటి.. ప్రేమకు ఒప్పుకోలేదని ఏం చేసిందో తెలుసా?

praveen
ఒకప్పుడు మగవారితో పోల్చి చూస్తే ఆడవాళ్లు తక్కువ అనే భావన అందరిలో ఉండేది. కానీ నేటి రోజుల్లో మాత్రం ఇలాంటి వివక్ష ఎక్కడ కనిపించడం లేదు. ఆడవాళ్లు మగవాళ్ళు ఒకటే అన్న ధోరణిలోనే అంతట పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చదువులు మొదలుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నింటిలో కూడా పురుషులతో సమానంగానే ఇక మహిళలు కూడా రాణిస్తూ ఉన్నారు. మహిళా సాధికారతవైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రతి విషయంలో కూడా ఆ పురుషులకు తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్న మహిళలు క్రైమ్ చేయడం విషయంలో కూడా పురుషులకు తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే.

 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఒకప్పుడు అమ్మాయి ప్రేమించడం లేదని యాసీడ్ పోయడం లేదంటే అత్యాచారం చేయడం లాంటివి చేసేవారు ఎంతోమంది అబ్బాయిలు. ఇక ఇలా చేసిన వారికి న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించేవి. ఇక అమ్మాయి ప్రేమించకపోతే ఏకంగా దారుణంగా దాడి చేయడం లాంటివి కూడా చేసేవారు. కానీ గత కొన్ని రోజుల నుంచి ఏకంగా అమ్మాయిలే అబ్బాయిలపై ఇదే విషయంలో దాడి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక ఇటీవల హైదరాబాద్ లో మరో యువతి కూడా రెచ్చిపోయింది. మొన్నటికి మొన్న ఒక అమ్మాయి ఏకంగా తాను చెప్పిన దానికి ఒప్పుకోలేదు అన్న కారణంతో ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన సంచలనగా మారిపోయింది.

 ఇక ఇప్పుడు త్రిష అనే మరో హైదరాబాది అమ్మాయి కూడా ఇలాంటిదే చేసింది. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. త్రిష అనే అమ్మాయి ప్రణవ్ అనే యువకుడిని కిడ్నాప్ చేసింది. మ్యాట్రిమోనీ సైట్లో ప్రణవ్ ఫోటో చూసి ఇష్టపడిన ఆమె తనను పెళ్లి చేసుకోవాలి అంటూ అతన్ని వేధించడం మొదలుపెట్టింది. అయితే అతను మాత్రం పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాడు. ఇలా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కక్ష కట్టింది. అతన్ని కిడ్నాప్ చేసి గదిలో బంధించింది త్రిష. ఎట్టకేలకు ఆమె భారీ నుంచి తప్పించుకున్న ప్రణవ్   ఇక పోలీసులను ఆశ్రయించి.. జరిగిన విషయాన్ని చెప్పాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: