మటన్ కోసం.. ఏకంగా ఫ్రెండ్ నే చంపేశాడు.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషుల లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని మనిషికి ఏదైనా అపాయం వస్తేనే అయ్యో పాపం అంటూ మానవత్వంతో సహాయం చేసేవారు. కానీ ఇప్పుడు సొంత వారి విషయంలో కూడా రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. చిన్నచిన్న కారణాలతోనే ఇక కోపంతో విచక్షణ కోల్పోతున్న మనుషులు.. సాటి మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేసేందుకు ఎక్కడ వెనకడుగు వేయడం లేదు.

 ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఇలా సిల్లీ రీసన్స్ తో జరుగుతున్న హత్యలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి మనుషులు కూడా నేటి సభ్య సమాజంలో బ్రతుకుతున్నారా అనే భావన ప్రతి ఒక్కరికి వచ్చేలా నేటి రోజులో చాలా ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తారో అని ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా మటన్ విషయంలో జరిగిన గొడవ ఒక వ్యక్తి దారుణ హత్యకు కారణమైంది.

 సికింద్రాబాద్ గోల్ బాయ్ బస్తీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన చారి, అజయ్ కి మటన్ తినే విషయంలో వాగ్వాదం జరిగింది. ఇద్దరూ తాగి ఉండడంతో గొడవ మరింత ముదిరింది. ఈ క్రమంలోనే అజయ్ కత్తితో చారి పై దారుణంగా దాడి చేశాడు. ఈ క్రమంలోని అక్కడికక్కడే కుప్పకూలిపోయిన చారి ఇక రక్తపు మడుగులో విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితున్ని గాలించి వెతికి పట్టుకొని మరి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కాస్త స్థానికులు అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: