ఒక్క వాట్సాప్ స్టేటస్.. ఇద్దరి ప్రాణాలు తీసింది?

praveen
సోషల్ మీడియా అనేది నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా పోయింది. ఇలా సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య ఏదైనా తేడా ఉంది అంటే సోషల్ మీడియాలో ఉండే బ్లూ టిక్ మాత్రమే అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే సెలబ్రిటీలు ఏదైతే చేయగలుగుతున్నారో సామాన్యులు కూడా అది చేయగలుగుతున్నారు. అయితే ఇక ప్రపంచాల మూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నారు.

 ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అరచేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తో వారితో మాట్లాడగలుగుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో ఇలాంటి సోషల్ మీడియాతోనే జాగ్రత్తగా ఉండకపోతే చివరికి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది అన్నదానికి నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా వాట్సాప్ స్టేటస్ ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైంది అని చెప్పాలి. వాట్సాప్ స్టేటస్ కారణంగా ప్రాణాలు పోవడమేంటి.  అందరూ ప్రతి రోజు ఏదో ఒక స్టేటస్ పెడుతూనే ఉంటారు. దాంట్లో కొత్త ఏముంది అంటారా

 మైసూరులోని హునసూరు కు చెందిన 28 ఏళ్ళ శృతి 20 ఏళ్ల మురళి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కొంతకాలం క్రితం వీరి మధ్య స్నేహం కుదిరింది. ఇక ఇద్దరికీ మధ్య సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. ఇక ఇటీవల ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని మురళి వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే స్టేటస్ ను ఊర్లో ఉన్న అందరూ కూడా చూసేసారు.  దీంతో ఇక వీరిద్దరి కుటుంబాల మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో భయపడిపోయిన శృతి ఏకంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ విషయం తెలిసిన మురళి భయంతో ప్రాణాలు తీసుకున్నాడు అని చెప్పాలి. దీంతో ఒక్క వాట్సాప్ స్టేటస్ ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: