పందెంకోడిని కొనేందుకు.. థాయిలాండ్ నుంచి వచ్చిన యువత.. కానీ?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచమంతా విస్తరించి పోయింది అన్న విషయం తెలిసిందే. దీంతో నేటి ఇంటర్నెట్ కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఎన్ని పనులు ఉన్న పక్కన పెట్టేసి ఇక సోషల్ మీడియాలో గంటల తరబడి కాలం గడుపుతున్న జనాలే నేటి రోజుల్లో ఎక్కువ కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఇక అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారిపోవడం అప్పుడప్పుడు జరుగుతుంది.


 అయితే ఇలాంటి తరహా వీడియోలతో కొంతమంది సోషల్ మీడియా జనాలు కూడా బాగా ప్రభావితం అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి వ్యక్తుల గురించే. సాధారణంగా సోషల్ మీడియాలో కోళ్ల పందాలకు సంబంధించిన వీడియోలు చాలానే ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. రెండు పందెం కోళ్ళు హోరాహోరీగా పోట్లాడుకుంటుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పాలి. అయితే ఉభయగోదావరి జిల్లాలో కోళ్ల పందాలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా లక్షల రూపాయలు ఈ కోళ్ల పందాలలో చేతులు మారుతూ ఉంటాయి.


 ఇదిలా ఉంటే.. ఈ ఏడాది భోగి పండక్కి పశ్చిమగోదావరి జిల్లాలోని ఘనప వరంలో జరిగిన కోళ్ల పందాలలో ఒక కోడి ఏకంగా 27 లక్షల పందెం గెలిచింది. ఈ క్రమంలోనే ఈ కోడి పందానికి సంబంధించిన వీడియో ని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో థాయిలాండ్ నెటిజెన్స్ దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే థాయిలాండ్ యువతీ యువకులు ఏకంగా ఆ దేశం నుంచి ఇండియాకి ఆ పందెంకోడిని కొనడానికి వచ్చారు. ఇక ఏలూరు జిల్లా రంగాపురంకు చెందిన రత్తయ్య దగ్గర మూడు లక్షలు వెచ్చించి మరి ఆ పందెంకోడిని కొనుగోలు చేయాలి అనుకున్నారు. కానీ రత్తయ్య అందుకు నిరాకరించగా ఇక ఆ కోడితో ఫోటో దిగి మరో పుంజును మూడు లక్షలతో కొనుక్కుని వెళ్ళిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: