అయ్య బాబోయ్.. రూ. కోటి ఇస్తామన్నా.. గొర్రెను అమ్మలేదు?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఏ చిన్న విషయమైనా సరే నిమిషాల వ్యవధిలో అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో వాలిపోతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఘటనలు కొన్ని కొన్ని సార్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక గొర్రెకు సంబంధించిన వార్త కూడా ఇలాగే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా గొర్రె ఎంత రేటు ఉంటుంది అన్నది అందరికీ తెలిసే ఉంటుంది మహా అయితే ఒక పది వేలు ఉంటుంది. ఇక మేలు జాతి గొర్రె అయితే ఇక మరింత ధర ఎక్కువగా ఉంటుంది. ఎంత ధర ఎక్కువగా ఉన్నా ఇక ఒక గొర్రె ధర లక్ష కంటే తక్కువే ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.


 ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక గొర్రెను ఏకంగా కోటి రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఎవరైనా వస్తే.. గొర్రె యజమానులు ఏం చేస్తారు. అబ్బా లక్ష్మీదేవి కటాక్షం లభించింది అని భావించి కళ్ళు మూసుకుని ఆ గొర్రెను విక్రయించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ గొర్రె యజమాని అలా చేయలేదు. కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన కూడా తాను పెంచుకుంటున్న గొర్రెను అమ్మెందుకు నిరాకరించాడు. దీంతో ఇక ఈ విషయం తెలిసి నేటిజన్స్   మాత్రమే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది ఎక్కడో కాదు రాజస్థాన్లో చోటుచేసుకుంది అని చెప్పాలి.



 చిరు జిల్లాలో కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ చేసిన గొర్రెను అమ్మెందుకు యజమాని నిరాకరించడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది   ఇంతకీ ఆ గొర్రె ప్రత్యేకత ఏమిటంటే.. ఆ గొర్రె పొట్టపై ఉర్దూలో 786 అనే ఆకారం ఉంటుంది. అయితే ఈ నెంబర్ ముస్లింలు ఎంతో పవిత్ర సంఖ్యగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది జన్మించిన ఈ గొర్రె ఇప్పటికే లక్షల రూపాయలు చెల్లించేందుకు ఎంతో మంది ముందుకు వచ్చిన.. అటు యజమాని మాత్రం అమ్మేందుకు ఒప్పుకోలేదు.  ఇక ఇటీవల ఏకంగా గొర్రెకు కోటి రూపాయలు ఆఫర్ చేసిన కూడా యజమాని గొర్రెను అమ్మను అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు. గొర్రెతో తనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే దానిని అమ్మేందుకు నిరాకరించినట్లు ఆ గొర్రె యజమాని చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: