అత్తను నరికి చంపిన అల్లుడు.. ఎక్కడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత  మనుషులు మానవ బంధాలకు  ఎక్కడ విలువ ఇవ్వడం లేదు అన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని వారికి కాస్త అపాయం కలిగితేనే అయ్యో పాపం అంటూ జాలి పడేవాడు మనిషి. కానీ ఇప్పుడు సొంత వారి విషయంలో కూడా కాస్తయినా మానవత్వాన్ని చూపించడం లేదు. చిన్న చిన్న కారణాలకే ఏకంగా కట్టుకున్న వారిని సొంత బంధువులను కూడా హత్య చేసేందుకు ఎక్కడ వెనకాడని పరిస్థితి నెలకొంది.

 ఇక్కడ విజయవాడలో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది. ఏకంగా అత్తను ఆమె అల్లుడే దారుణంగా కత్తితో నరికి చంపాడు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోను నైనవరం ఫ్లైఓవర్ పై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది అని చెప్పాలి. అయితే మామను కూడా చంపేందుకు ప్రయత్నించగా వేగంగా బైక్ నడిపి తప్పించుకోగలిపాడు సదరు వ్యక్తి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వైఎస్ఆర్ కాలనీకి చెందిన గోగుల నాగమణి గురుస్వామి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం కాగా.. రెండో కుమార్తె లలితను ఏకలవ్య నగర్ కు చెందిన రాజేష్ కు ఇచ్చి వివాహం చేశారు. గత కొంతకాలం నుంచి రాజేష్ లలిత మధ్య గొడవలు జరగడంతో రాజేష్ పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు లలిత పేరెంట్స్.

 అప్పటినుంచి లలిత పుట్టింట్లోనే ఉంటుంది. అయితే విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకోగా చివరి దశలో ఉంది. ఈ క్రమంలోనే రాజేష్ తన అత్తమామలపై పగ పెంచుకున్నాడు ఎలాగైనా చంపాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఇటీవల పెద్ద కుమార్తె ఇంటికి గురుస్వామి నాగమణి బైక్ పై బయలుదేరారు. అయితే వీరిని బైక్ పై వెంబడించిన రాజేష్ మరో వ్యక్తితో కలిసి నైనవారం ఫ్లై ఓవర్ వద్ద బైక్ను అడ్డుకొని దారుణంగా హత్య చేశాడు. అయితే మామ గురుస్వామిని కూడా చంపబోగా అతని బైక్ వేగంగా నడపడంతో చివరికి తప్పించుకో గలిగాడు. కేసు నమోదు చేసిన  పోలీసులు రాజేష్ సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: