ఆన్లైన్ ఆర్డర్.. నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయింది?

praveen
ఇటీవల కాలంలో మనిషి టెక్నాలజీకి ఎంత అలవాటు పడిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు అయితే కేవలం సంపన్నులు మాత్రమే కూర్చున్న చోటికి కావలసినవి అన్నీ కూడా పని వాళ్ళతో తెప్పించుకునేవారు. సామాన్యుడు మాత్రం కావాల్సినది తెచ్చుకోవాలి అంటే బయట ఎక్కడో ఉన్న దుకాణానికి వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు సామాన్యుడు కూడా టెక్నాలజీ కారణంగా సంపన్నుడి లాగా జీవితాన్ని గడపగలుగుతున్నాడు. తనకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో కూర్చున్న చోటికి తెప్పించుకోగలుగుతున్నాడు.


 దీంతో వేసుకునే చెప్పులు బట్టల దగ్గర నుంచి తినే ఆహారం వరకు ఏ దానికోసం కూడా ఇంటి గడప దాటి బయటికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. దీంతో టెక్నాలజీని ఉపయోగించుకుని అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు ఇక ఇంటి ముందుకే అన్ని వస్తువులు కూడా తెచ్చి ఇచ్చే సర్వీసులు ప్రస్తుతం చాలానే అందుబాటులో ఉన్నాయి.  ఇలా ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ కామర్స్ కంపెనీలు ఎన్నో కస్టమర్లకు అత్యంత వేగంగా డెలివరీలు చేసే విధంగా పోటీ పడుతూ ఉన్నాయి.


 దీంతో ఒకప్పటిలా ఏదైనా వస్తువు ఆర్డర్ చేస్తే రోజుల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా పోయింది. కేవలం గంటల వ్యవధిలోనే డెలివరీ అవుతుంది. అయితే ఇక్కడ మాత్రం ఏకంగా ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన ఒక వస్తువు నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయింది. ఢిల్లీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నితిన్ 2019లో చైనాకు చెందిన ఆలీ ఎక్స్ప్రెస్ లో ఒక వస్తువుని ఆర్డర్ చేశాడు. అయితే ఇటీవలే అది డెలివరీ అయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎవరు ఆశలు కోల్పోవద్దు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మీ వస్తువులు డెలివరీ అవుతాయి అంటూ ఒక ఫన్నీ కామెంట్ కూడా రాసుకొచ్చాడు.  కాగా 2020లో భద్రత కారణాల వల్ల అలీ ఎక్స్ప్రెస్ ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: