కరెంట్ షాక్ పెట్టి.. అత్తమామలను చంపాలనుకున్నాడు.. కానీ?

praveen
ఇటీవల కాలంలో ఎవరు కూడా బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వడం లేదు అన్న విషయం తెలిసిందే . ఆస్తులు అంతస్తులు ముఖ్యం అనుకుంటున్న వారు రక్తసంబంధాలను సైతం దూరం చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది అయితే ఏకంగా ఆస్తులను దక్కించుకోవడం కోసం సొంత వారి ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమవుతూ ఉండడం సంచలనంగా మారిపోతూ ఉంది. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఎప్పుడు ఎవరు ప్రాణాలు తీస్తారో అనే ఆలోచనతో భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఇక మరోవైపు చిన్న చిన్న కారణాలకే ఏకంగా క్రూర మృగాల్లా మారిపోతున్న మనుషులు సాటి మనుషుల ప్రాణాలు తీయడానికికూడా వెనకడుగు వేయని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా భార్యాభర్తల బంధం లో తలెత్తుతున్న ఎన్నో తగాదాలు ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా పిలిస్తే పలకలేదు అన్న చిన్న కారణంతో ఏకంగా అత్తమామలకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేందుకు ప్రయత్నించాడు అల్లుడు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనం గా మారిపోయింది. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

 సంజీవ్ రావు పేట్ లో కరెంట్ షాక్ తో అత్తమామల హత్యకు స్కెచ్ వేశాడు అల్లుడు. చివరికి అరెస్ట్ అయి ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇంటికి వస్తే పిలిస్తే పలకలేదు అన్న కోపంతో అత్తమామలను చంపాలి అని అనుకున్నాడు అల్లుడు రమేష్. దీనికోసం పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో అందరూ పడుకున్న తర్వాత ఇక కరెంట్ మీటర్ల నుంచి రెండు కరెంటు వైర్లను తీసి అటు తలుపులకు వేలాడదీశాడు. అయితే ముందు నుంచి ఇదంతా గమనించిన అత్తమామలు ఇక ఆ తర్వాత అతనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: