అయ్య బాబోయ్.. బతికుండగానే.. అంతిమయాత్ర చేసుకున్నాడు?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాపులారిటీ అవ్వడానికి చేస్తున్నారో లేక ఇంకేదైనా కారణం ఉందో కానీ జనాలు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇక మనుషుల్లో ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేసే మనుషులు కూడా ఉన్నారా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. అచ్చం సినిమాల్లో చూపించినట్లు కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే కొంతమంది వింతైన పనులు చేస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఎవరైనా కాస్త వింతగా ఆలోచించారు అంటే చాలు అది ఇక ఇంటర్నెట్ను షేక్ చేస్తూ వైరల్ గా మారిపోతూ ఉంటుంది.


 ఇక ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా ఎవరికి అయినా సరే చనిపోయిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించడం చేస్తూ ఉంటారు. అయితే ప్రాణం పోయిన వ్యక్తులకు అంత్యక్రియలు ఎలా జరుగుతున్నాయి అన్న విషయం మాత్రం తెలియదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన అంత్యక్రియలు ఎలా జరుగుతాయో చూడాలని భావించాడు. ఈ క్రమంలోనే బతికుండగానే అంతిక్రియలు చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 కొండలం పట్టుకు చెందిన జయమని అనే వ్యక్తి విచిత్రమైన పని చేసి వార్తల్లోకి ఎక్కాడు. బతికుండగానే అంతిమయాత్ర చేసుకుంటానంటూ ఏకంగా స్థానికంగా ఉండే మరియమ్మన్ అమ్మవారికి మొక్కుకున్నాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులను ఒప్పించి మరి ఊరంతా సంతాప పోస్టర్లు వేయించాడు. పాడే మీద పడుకుని ఉన్న జయమనిని బంధువులు ఊరంతా ఊరేగించి స్మశానంలో వదిలిపెట్టారు అని చెప్పాలి. ఇక సాయంత్రానికి అతను మళ్లీ తిరిగి ఇంటికి వచ్చేసాడు. అయితే ఈ విషయం గురించి తెలిసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇక స్థానికంగా జయమని చేసిన పని కాస్త తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: