ప్రేమ పెళ్లికి పెద్దలు ఓకే.. అయినా ఆత్మహత్య చేసుకున్న జంట?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషిలో విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే నిండు నూరేళ్ల జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించాల్సింది పోయి చిన్న చిన్న కారణాలకే అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. క్షణికావేషంలో వెనక ముందు ఆలోచించకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతోమంది ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 ముఖ్యంగా నేటి రోజుల్లో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కారణంగా మారిపోయింది. ఎందుకంటే ప్రేమించిన వారు తమ ప్రేమను అంగీకరించలేదు అన్న కారణంతో కొంతమంది దారుణంగా ప్రాణాలు తీసేస్తూ ఉంటే.. ప్రేమించిన వారి చేతిలో మోసపోయాము అని భావించి ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇంకొన్నిసార్లు ప్రేమను గెలిపించుకునేందుకు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఇక దారుణ హత్యలకు గురవుతున్నారు. అయితే ఇలా ప్రేమించిన వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇక వారి జీవితానికి అది చాలు అని అనుకుంటూ ఉంటారు.

 ఒకవేళ ప్రేమ విఫలమైతే ఆత్మహత్య చేసుకోవాలి అని ముందుగా అనుకున్నప్పటికీ అలాంటి ఆలోచనలను పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మాత్రం విరమించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఓ జంట మాత్రం క్షణికావేషంలో తీసుకోకూడని  నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా దొనబండ వాసులైన శ్రీకాంత్, సంఘవి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇద్దరు బయటికి వెళ్లి మాట్లాడుకున్నారు. అప్పులు బాగా పెరిగాయని పెళ్లయితే జీవితం కష్టంగా ఉంటుందంటూ క్షణికావేషంలో నిర్ణయం తీసుకొని పురుగుల మందు తాగాడు శ్రీకాంత్. ఇక భయపడి సంఘవి కూడా పురుగుల మందు తాగింది. దీంతో స్థానికులు గమనించి వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఇక ఇద్దరు కూడా మరణించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: