ప్రాణం తీసిన బెట్టింగ్ యాప్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

praveen
సులభంగా డబ్బు సంపాదించడం ఎలా.. ప్రస్తుతం మిడిల్ క్లాస్ జీవితాన్ని గడుపుతూ.. వచ్చిరాని జీతంతో సర్దుకు  పోతూ ఉన్న ప్రతి ఒక్కరి మైండ్ లో కూడా ఇలాంటి ఆలోచన మెదులుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకవైపు ఎప్పుడూ చేసే ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సులభంగా డబ్బు సంపాదించడం ఎలా అని కొన్ని కొన్ని మార్గాలను ఎంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో కొంతమంది ఏకంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా భారీగా డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతో ఎలాంటి అనుభవం లేకుండానే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. తద్వారా చివరికి ఉన్నది మొత్తం పోగొట్టుకుని  రోడ్డుపాలు అవుతున్నారు ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 అయితే తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో సంపాదించేందుకు అవకాశం ఉంటుందని.. లక్షలు కాదు కోట్ల రూపాయలను కొల్లగొట్టవచ్చు అని ఎన్నో బెట్టింగ్ యాప్స్ ఇటీవల కాలంలో తమ ప్రకటనల ద్వారా ఎంతో మంది యువకులను వలలో వేసుకుంటున్నయ్. ఈ క్రమంలోనే సులభంగా డబ్బు సంపాదించాలి అనుకునేవారు చివరికి బెట్టింగ్ యాప్స్ మాయలో పడిపోతున్నారు. చివరికి అప్పులు చేసి మరి బెట్టింగ్ పెడుతూ  ఉన్నది మొత్తం పోగొట్టుకుంటున్నారు. దీంతో చివరికి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి..

 ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్స్ కి అలవాటు పడిన ఒక యువకుడు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి మామిడిపల్లి కి చెందిన 28 ఏళ్ల రాజశేఖర్ గా గుర్తించారు. హైదరాబాద్ లోని ఎయిర్పోర్టులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్ వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: