ఎంతకీ పెళ్లి చేయడం లేదని.. ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో సభ్య సమాజంలో వెలుగులోకి వస్తున్న దారుణమైన ఘటనలు మానవ బంధాలను ప్రశ్నార్థకంగా మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఒకప్పుడు బంధాలకు బంధుత్వాలకు ఎక్కువగా విలువ ఇచ్చేవాడు మనిషి. లోకాన్ని శాసిస్తున్న మనీ కంటే మనుషుల మధ్య ఉండే రక్తసంబంధాలు.. అనుబంధాలు ఎంతో ముఖ్యమైనవి అని భావించేవాడు. కానీ ఇటీవల కాలంలో మాత్రం మనీ కంటే విలువైనది ఏదీ లేదని బంధాలు బంధుత్వాలు అంత ట్రాష్ అని కొట్టి పారేస్తూ ఉన్నాడు. వెరసి రోజు రోజుకు మనిషిలో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది. తద్వారా ఏకంగా ఉన్మాదిగా మారిపోతున్న మనిషి సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు అని చెప్పాలి.

 పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వాళ్ళ విషయంలో కూడా ఇంతే దారుణంగా ఆలోచిస్తున్నారు మనుషులు. ఏకంగా ఆస్తుల కోసం కొంతమంది ఏకంగా తల్లిదండ్రులని హత్య చేస్తూ ఉంటే.. ఇంకొంతమంది ఏకంగా కడుపున పుట్టిన పిల్లలను కూడా దారుణంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరికొంతమంది చిన్న చిన్న కారణాలకే ఉన్మాదులుగా మారిపోతూ ఇక సొంత వారి పాలిట యమకింకారులుగా మారిపోతున్నారని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.

 ఇక్కడ ఓ యువకుడు ఏకంగా తల్లిని దారుణంగా చంపేశాడు. అయితే ఇలా హత్య చేయడానికి వెనుక కారణం ఏంటో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు. ఏకంగా తనకు వివాహం చేయట్లేదని తల్లిని క్రికెట్ బ్యాట్ తో ఇనుప రాడుతో కొట్టి చంపేశాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్ లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు పర్హాన్ తో కలిసి ఉంటుంది తల్లి అస్మా. అయితే తన పెళ్లి గురించి తల్లి పట్టించుకోవడంలేదని ఫరహాన్ కోపంతో ఊగిపోయాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెను దారుణంగా కొట్టి చంపేశాడు. ఇక భవనం నుంచి కింద పడిపోయింది అని నమ్మించేందుకు ప్రయత్నించగా.. పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: