సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు వెళ్లి.. చివరికి?

praveen
ఇటీవలి కాలంలో మనిషి పైనకు నవ్వుతూ కనిపిస్తున్న లోపల మాత్రం ఎన్నో కుళ్ళు కుతంత్రాలు నిండి పోయి ఉంటున్నాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఎదుటి వాడి ఎదుగుదలను చూసి మనిషి అసలు ఓర్వ లేక పోతున్నాడు. మనుషుల్లో మానవత్వం ఉంటుంది అన్న విషయాన్ని మరిచి దారుణం గా ప్రవర్తించటం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. అయితే మనం ఒకప్పుడు కేవలం సినిమాల్లో  మాత్రమే పగలు ప్రతీకారాలు ఉంటాయి అని అనుకునే వాళ్ళం. కానీ ఇటీవల కాలం లో నిజ జీవితం లో కూడా ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.

 తన కుటుంబం లో ఒకరిని హత్య చేశారు అని పగ పెంచుకున్న వారు.. ఇక ప్రత్యర్థి కుటుంబం లోని వ్యక్తులను దారుణం గా హత్య చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇలా ఎక్కడ చూసినా రక్తపాతం కనిపిస్తుంది అని చెప్పాలి. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి తరహా  ఘటన వెలుగు చూసింది.  సునీల్ అనే వ్యక్తి సోదరుడిని ప్రత్యర్థి రాహుల్ అజయ్ ముఖేష్ వారి అనుచరుల తో కలిసి దారుణం గా కొట్టి చంపారు.

 ఈ క్రమం లోనే తన సోదరుడు ని చంపిన ప్రత్యర్థులపై ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాలని సునీల్ భావించాడు. పట్టలేని కోపం తో మరునాడు చేతిలో కొడవలి పట్టుకుని ప్రత్యర్థులపై దాడి చేసేందుకు వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన ప్రత్యర్థులు  సునీల్ చేతిలో ఉన్న కొడవలి లాక్కొని రాడ్లు కర్రలతో దారుణంగా కొట్టి చంపారు. అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు సునీల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు కారణమైన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: