మండపంపై షాకిచ్చిన వధువు.. జరిగింది తెలిస్తే ఆమె కరెక్ట్ అంటారు?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ఎంతో మధురమైన జ్ఞాపకం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే పెళ్లి మరింత ప్రత్యేకం గా మార్చుకునేందుకు ఇటీవలి కాలం లో ఎంతో మంది ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కొంతమంది మాత్రం పెళ్లి విషయం లో కూడా కాస్త చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఇటీవల ఏకంగా పెళ్లి వేదికపైకి వరుడు మద్యం తాగి రావడం తో వధువు ఒక్క సారిగా షాక్ అయింది. ఇక అదే వేదికపై షాకింగ్ నిర్ణయం తీసుకుని నాకు ఈ పెళ్ళి వద్దు అంటూ ముఖం మీదే తెగేసి చెప్పేసింది.

దీంతో అప్పటివరకు సందడి సందడిగా ఉన్న పెళ్లి మండపం లో ఒక్క సారిగా ఊహించని ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అనే చెప్పాలి.  ఈ ఘటన కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది. ఎంతో ఊరేగింపు తో వధువు ఇంటికి చేరుకున్నాడు వరుడు. ఈ క్రమం లోనే జయమాల సమయంలో వరుడి నోటి నుంచి దుర్వాసన రావడాన్ని వధువు గమనించింది. అంతేకాకుండా ఇక వేదికపైకి వస్తున్నప్పుడు వరుడి కాళ్ళు తడబడుతున్నాయి అని కూడా గమనించింది. దీంతో మరో ఆలోచన చేయకుండా పెళ్లికి నిరాకరించింది.

 వధువు పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ లో మునిగి పోయిన కుటుంబసభ్యులు వెంటనే ఒక సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ వధువు ఎంత చెప్పినా వినక పోవడంతో చివరికి వరుడి స్నేహితులు అందరూ కూడా గొడవ పడ్డారు. ఈ ఘటనలో ఎంతో మందికి గాయాలు అయ్యాయి. అయినప్పటికీ పెళ్లి కూతురు మాత్రం ఒప్పుకోలేదు. చివరికి వరుడు ఏమి చేయలేక పెళ్లి చేసుకోకుండానే తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన వారణాసిలోని మంకయ్య గ్రౌండ్ లో వెలుగు చూసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: