ఛీ..ఛీ..అసలు ఈమె తల్లేనా..దారుణం ?

Satvika
కడుపున పుట్టిన కూతురుకు ఏదైనా కష్టం వచ్చింది అంటే ఆ తల్లి గుండె విలవిల లాడి పోతుంది..కాల్లొ ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఆమె కంట్లో నీళ్ళు తిరగడం చూసే ఉంటారు.అలాంటి భూమ్మీద ఓ తల్లి కసాయిగా ప్రవర్థించింది.కూతురిని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించింది. భర్త కు దూరం అయిన ఈ మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంభందం పెట్టుకుంది.అలాగే తన ప్రియుడితో కూతురు పై గత కొన్నేళ్ళుగా అత్యాచారం చేయించింది.అలా ఆమె గర్భం దాల్చిన తర్వాత పిండంను వేరే వాళ్ళకు అమ్ముతూ సొమ్ములు సంపాదిస్తుంది..దారుణం ఆ చిన్నారికి నరకాన్ని చూపించింది.

 
విషయానికొస్తే..తమిళనాడు ఈ రోడ్‌లో కన్నతల్లి చేసిన అక్రమ నిర్భంధ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ కన్నతల్లి తన కూతురి నుంచి బలవంతంగా అండ సేకరణ చేపట్టి.. అక్రమ సరోగసీ కోసం ఆస్పత్రులకు అమ్మేసుకుంది..తమిళనాడు ఈ రోడ్‌లో జరిగిన ఈ ఘోరంపై హైలెవల్‌ దర్యాప్తు కొనసాగుతోంది. మెడికల్‌ అండ్‌ రూరల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డైరెక్టోరేట్‌ అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. జాయింట్‌ డైరెక్టర్‌ విశ్వనాథన్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. సోమవారం స్టేట్‌ హోంలో ఉన్న బాధితురాలిని పరామర్శించి మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఈ రోడ్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలోని ఆస్పత్రుల్లో ఈ ఇల్లీగల్‌ సరోగసీ వ్యవహారం నడిచినట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు.


అంతేకాదు.. గత ఐదేళ్లుగా.. బాధితురాలిపై అత్యాచార పర్వం కొనసాగుతోంది. బాధితురాలి నుంచి అండాలను బలవంతంగా సేకరించి.. ఆస్పత్రులకు అమ్మేసుకుంటూ ఆ తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి.. డబ్బులను పంచుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. కూతురి వయసును ఆధార్‌కార్డులో మార్పించేసి మరీ ఈ దందాకు పాల్పడుతూ వస్తున్నారు.జూన్‌ 1వ తేదీన వేధింపులు భరించలేక బాధితురాలు ఇంటి నుంచి పరారైంది. సేలంలోని తన స్కూల్‌ స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుని.. బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో యాక్ట్‌, ఐపీసీలోని పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి,ఆధార్ ను మార్చిన వ్యక్తిని మొత్తాన్ని అదుపులోకి తీసుకోనున్నారు..ఈ విషయాన్ని వైద్య శాఖ సీరియస్ గా తీసుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: