రెండో భార్యతో భర్త.. తగల బెట్టిన మొదటి భార్య..

Satvika
ఆడ వాళ్ళకు ఆడ వాళ్ళే శత్రువులు అన్న విషయం తెలిసిందే..దేన్నీ పంచుకోవడంలోనైనా రాజి పడరు కానీ కట్టుకున్న భర్తను మాత్రం అస్సలు పంచుకొరు..సవతి పోరు కన్నా కూడా చావడం మేలు అని చాలా మంది అనుకుంటారు.. అలాంటిది భార్యకు తెలియకుండా ఎంతో మంది వేరే మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకోవడం కానీ, రెండో పెళ్ళి చేసుకోవడం కానీ చేస్తారు..అవి కొన్ని భార్యలకు తెలిస్తే నానా రచ్చ చేస్తారు.లేదా చావడం , చంపటం కానీ చేస్తారు.. ఇప్పుడు ఓ మహిళ మాత్రం అందరికి షాక్ ఇచ్చింది. రెండో భార్య దగ్గర భర్త ఉన్నాడని ఏకంగా ఆ ఇంటికే నిప్పు పెట్టింది.


వామ్మో అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది..తర్వాత ఏం జరిగింది అనే విషయం గురించి వివరంగా తెలుసుకుందాము.. దర్బాంగలోని బీరౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుపాల్ బజార్‌లో నివాసం ఉంటున్న 40 ఏళ్ల ఖుర్షీద్ ఆలం- బీబీ పర్వీన్‌భార్యాభర్తలు. వీరికి పదేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఆ దంపతులకు సంతానం కలగలేదు. బిడ్డ కోసం ఎన్ని ప్రయత్నాలు చేపినా ఫలించలేదు. దీంతో పిల్లలు అంటే ఇష్టం ఉన్న ఖుర్షీద్ ఆలం...రెండేళ్ల క్రితం సమీపంలోని గ్రామానికి చెందిన 32 ఏళ్ల రోష్నీ ఖాతూన్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ భర్త రెండో పెళ్లి చేసుకోవడంపై మొదటి భార్య బీబీ పర్వీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండో పెళ్లి చేసుకుంటే తీవ్ర పరిణామాలతో ఖుర్షీద్‌ను బెదిరించేది.


అయితే అతను రెండో పెళ్ళి చేసుకోవడం మాత్రం అతను మానుకోలేదు..మొత్తానికి రెండో వివాహం చేసుకున్నాడు.ఈ క్రమంలోనే శనివారం ఉదయం 5 గంటల సమయంలో భర్త,రెండో భార్య ఇంట్లో నిద్రిస్తుండగానే పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటించింది బీబీ పర్వీన్. ఈ ఘటనలో పర్వీన్, ఆమె 65 ఏళ్ల అత్త రుఫైదా ఖతూన్ కాలి బూడిదయ్యారు. రోష్నీ ఖాతూన్, ఖుర్షీద్ ను తొలుత సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తీసుకెళ్లి, అక్కడినుంచి ధర్భంగా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ మరణించారు.ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: