తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. భర్త ఏం చేసాడో తెలుసా?

praveen
అదేంటోగాని ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషులు తాము మనుషులం అన్న విషయాలను మర్చిపోతున్నారు అన్నది మాత్రం అర్థమవుతోంది. సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనుషులు ఇటీవల కాలంలో ఎన్నో నీచమైన పనులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. దీంతో నేటి రోజుల్లో మనుషుల్లో మానవత్వం అనేది ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి. పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా జాలి దయ చూపించకుండా కర్కశంగా  వ్యవహరిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక్కడ ఓ దారుణ ఘటన జరిగింది భర్త అంటే భార్యకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. తనను నమ్మి మెట్టినింట్లో అడుగు పెట్టిన భార్యకు నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వాలి. కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం ఏకంగా భార్యకు సమస్య గా మారిపోయాడు. తాగుడుకు బానిస గా మారి పోయి చివరికి కుటుంబ బాధ్యతలను వదిలేశాడు. ఇటీవలే మరో దారుణానికి పాల్పడ్డాడు. తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదు అన్న కారణంతో ఆగ్రహంతో భార్య పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చివరికి తీవ్ర గాయాలపాలైన సదరు మహిళా చికిత్స పొందుతూ మృతి చెందింది.
 ఈ ఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. లక్ష్మి కూడా రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో ఉండే రాజు, అనితా బాయి దంపతులకు కుమారుడు బాలచందర్ ఉన్నాడు. అయితే ఉస్మానియా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ లేబర్ గా పని చేస్తూ ఉంది అనితా బాయి. అయితే ఇటీవల కాలంలో ఎలాంటి పని పాట లేకుండా తిరుగుతున్నారు రాజు. భార్య సంపాదన పైన  ఆధారపడుతూ ఉన్నాడు. అదే సమయంలో మద్యానికి బానిస గా మారిపోయాడు. ఇటీవలే మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలి అంటూ అడగగా ఇవ్వను అని చెప్పింది భార్య. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ భార్య పై చల్లి నిప్పంటించాడు. చివరికి స్థానికులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: