క్రైమ్: ప్రేమ పెళ్లి.. ఊహించని రీతిలో షాకిచ్చిన యువతీ..!!

N.ANJI
గత మూడేళ్ల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇద్దరు ఇంట్లో వీరి ప్రేమ విషయం చెప్పగా వారు పెళ్ళికి అంగీకారం తెలుపలేదు. ఇక ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయి డిసెంబర్ 30న పెళ్లి చేసుకొని ఒక్కటైయ్యారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి చంపేస్తానని ఫోన్ చేసి బెదిరించాడు. ఇద్దరు తమకు ప్రాణ హాని ఉందని, రక్షణ కోరుతూ ఈ కొత్త జంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడి పంపించారు.
ఈ తరుణంలోనే సదరు యువతి తన ప్రియుడికి ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. ఆమె తన తల్లిదండ్రులతో వెళ్లిపోతానని, ఇతనితో కలిసి ఉండనని ఆమె పోలీసుల ముందు చెప్పడంతో పోలీసులు ఆమెను తల్లిదండ్రులతో పంపించారు. యువతీ మాటలకు షాకైన ఈ కొత్త పెళ్లి కొడుకు తీవ్ర  మనస్తాపం చెందిన ఈ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని విలుపురం జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వలవనూర్‌కు చెందిన వెట్రివేల్ అనే 20 ఏళ్ల యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన ధరణి(19) అనే యువతి గత మూడేళ్లుగా ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకున్నారు. ఇద్దరి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి కడలూరులోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. యువతీ కుటుంబం నుంచి బెదిరింపులు ఎదురు కావడంతో ప్రాణ హాని ఉందని విలుపురం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.
దీంతో పోలీసులు ఇరు కుటుంబాలకు నోటీసులు పంపించి.. మాట్లాడాలని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలోనే ధరణి తనను పెళ్లి చేసుకున్న ప్రియుడికి ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. ఇక తల్లిదండ్రులతో కలిసి వెళ్లిపోయేందుకు ధరణి రెడీ అయ్యింది. అలాగే యువతీని ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన వెట్రివేల్ ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: