జంట హత్యల కలకలం..చెల్లిని చంపిందని తల్లిని హత్య చేసిన కొడుకు
కూతురు తరుచూ మొబైల్ చూస్తుందని, ఫోన్ మాట్లాడుతున్నదని తల్లి మందలించింది. ఈ తరుణంలో తల్లి ఖుర్షిదాకు కూతురు హలీంకు వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో ఆగ్రహానికి గురైన తల్లి.. కూతురు మెడకు చున్ని వేసి బెదిరించే యత్నం చేసింది. పొరపాటున ఉరి బిగిసుకొని కూతురు మృతి చెందింది. ఈ ఘటన చూసిన కొడుకు ఆగ్రహాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న కత్తిని తీసుకొని తల్లిపై దాడి చేశాడు. దీంతో ఆమె మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
తల్లి ఖుర్షిదా మెడపై కత్తి గాట్లు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. వారి బంధువులను ఆరా తీయగా.. కుమారుడు గురించి పోలీసులకు చెప్పారు. పోలీసులు కుమారుడి కోసం గాలించి పట్టుకున్నారు. దీంతో సంచలన విషయాలు వెల్లడించాడు. మా చెల్లి ఫోన్ చూస్తుండగా మా అమ్మ మెడకు చున్నితో ఉరివేయబోయింది. అది అకస్మాత్తుగా బిర్రుగా బిగుసుకుని చనిపోయింది. కోపంలో ఏమి చేయాలో తోచక మా అమ్మను కత్తితో పొడిచి పారిపోయాను అని వెల్లడించాడు. క్షణంలో కలిగిన ఆవేశంలో రెండు ప్రాణాలు బలికావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిన్న మన్న వారిద్దరూ కండ్ల ముందే కనబడే వారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కనిపించకుండా పోయే సరికి స్థానికులు రోధిస్తున్నారు. పోలీసులు రెండు మృతదేహాలను పోస్టు మార్టం కోసం మృతదేహాలను రిమ్స్ ఆసుప్రతికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నకాశీవీధి గ్రామంలో ఈ సంఘటనతో విషాదఛాయలు అలుముకున్నాయి.