పాముకాటుతో భార్య మృతి.. భర్తకు రెండుసార్లు జీవితఖైదు?
సాధారణంగా భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి ఒక వేళ విడిపోవాలని భావిస్తే చట్ట ప్రకారం విడాకులు తీసుకొని విడిపోవచ్చు. కానీ నేటి రోజుల్లో ఎవరూ అలా చేయడం లేదు.. విడాకులు తీసుకోవడం మానేసి ఇక కట్టుకున్న వారితో ఉండడం ఇష్టం లేక ఏకంగా ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రాణాలు తీస్తే శిక్షలు పడతాయన్న భయం కూడా కనిపించడం లేదు. అయితే గతంలో కేరళలో ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వచ్చిన సంచలన గా మారిపోయాయ్ అన్న విషయం తెలిసిందే. ఏకంగా కసాయి భర్త భార్యను రెండుసార్లు పాము తో కరిపించి మరి చంపాడు.
ఈ ఘటన అప్పట్లో సంచలనం గా మారిపోయింది. 2020 లాక్ డౌన్ సమయంలో కేరళకు చెందిన నిందితుడు సురేష్ భార్య పైకి నాగుపామును ఉసిగొల్పాడు. ఏకంగా రెండుసార్లు కాటు వేయించాడు. ఆ తర్వాత భార్య మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకొని తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. తానే పాముతో భార్యను కాటు వేయించి చంపాను అన్న విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ కోర్టులో జరుగుతూ రాగా ఇటీవలే ఇక నిందితుడికి రెండుసార్లు జీవితఖైదు విధించింది కోర్టు.