భర్త అన్నయ్య అవుతాడని తెలిసి.. భార్య షాకింగ్ నిర్ణయం?

praveen
ప్రతి యువతి కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెడుతోంది..  కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటుంది.  ఈ క్రమంలోనే కొంతమంది ప్రేమ వివాహం చేసుకుంటే మరి కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసు కుంటూ ఉంటారు. అయితే ఇలా ప్రేమ వివాహం చేసుకునే వారు ఇంకా సంతోష పడి పోతూ ఉంటారు. నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటే ఇక జీవితంలో అంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉంటారు.  కానీ ఇక్కడ ఒక యువతి విషయంలో మాత్రం ప్రేమ వివాహమే చివరికి ప్రాణం పోవడానికి కారణం అయింది.

 ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు గడిచిపోయాయి. కానీ అంతలో ఊహించని నిజం ఆ అమ్మాయికి తెలిసింది.  చివరికి ఆ నిజాన్ని జీర్ణించుకోలేరు పోయింది. ఆ యువతి దీంతో ఇక ఈ జీవితం వృధా అనుకొని భావించి బలవన్మరణానికి పాల్ప డి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇల్లందు కు చెందిన బోడ శ్వేతా అనే 21 ఏళ్ల యువతి   వెంకటేష్ అనే 24 ఏళ్ళ యువకుడితో ప్రేమలో ఉంది.  ఇక ఎన్నో రోజుల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు.

 ఇక మనసుకు నచ్చిన వాడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నాను అనుకుంటూ ఆ యువతి ఎంతో సంతోషం లో మునిగిపోయింది. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. కానీ ఇంతలో ఆ యువతి చెవినా ఒక ఊహించని నిజం వినిపించింది. కులం ఇంటి పేరు తప్పుగా చెప్పి వెంకటేష్ పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసింది. కొన్ని రోజుల్లోనే శ్వేతకు ఆ యువకుడి కులం ఏంటో తెలిసింది. అంతేకాదు ఇక ప్రేమ వివాహం చేసుకున్న భర్త వరసకు అన్న అవుతాడు అనే నిజం కూడా తెలిసి మనో వేదనకు గురైంది శ్వేత. ఇక ఈ విషయాన్ని జీర్ణించుకోలేక చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత వెంకటేష్ కూడా ఆత్మహత్యయత్నం చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: