పెంచిన పాపానికి తల్లినే హత్య చేసిన కూతురు..!!

N.ANJI
మానవత్వంతో ఓ మహిళ ఇద్దరు అనాథలను చేరదీసి అన్ని తానై పెంచింది. కానీ ఆమె పెంచిన ఓ యువతినే ఆమె ప్రాణాలను బలి తీసుకుంటుందని ఆమె ఉహించి ఉండదు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్‌కి చెందిన మేరీ క్రిస్టీనా(68) తన కుమార్తెలు మేరీ సొలాంగ్‌, రెబెకాలను తీసుకొని హైదరాబాద్‌ జీవనం సాగిస్తుంది. అయితే ఆమె ఓ కుమార్తె మేరీ సొలాంగ్.. ప్రశాంత్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక మేరీ, ప్రశాంత్‌లు సన్‌సిటీలో నివాసిస్తున్నారు. అలాగే.. క్రిస్టీనా మరో కూతురు పుదుచ్చేరిలో నివసిస్తుంది.
ఈ తరుణంలోనే క్రిస్టీనా అనాథలైన రోమా(24), ప్రియాంకలను ఇంట్లో ఉంచుకుని వారి బాగోగులు చూసుకుంటుంది. ఇక రోమాకు పెళ్లి చేయాలని ఆమె కోసం సంబంధాలు చూస్తుంది. కానీ.. రోమా నంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విక్రమ్‌ శ్రీరాములు(25)తో ప్రేమలో పడింది. అంతేకాదు.. క్రిస్టీనాకు తెలియకుండా అతనితో సహజీవనం చేస్తుంది. క్రిస్టీనా ప్రవర్తనలో తేడాను గమనించిన రోమా ఆమెను మందలించింది.
అయితే బొటిక్‌ పెట్టుకునేందుకు డబ్బులు ఇవ్వాలని కిస్ట్రీనాను రోమా అడిగింది. దానికి కిస్ట్రీనా నిరాకరించడంతో ఆమెను చంపాలని రోమా అనుకుంది. ప్రియుడి సహాయంతో క్రిస్టీనాను చంపేందుకు ప్లాన్ వేసింది. ఇక అందుకు  శ్రీరాములు అతని పాత స్నేహితుడు రాహుల్ గౌతమ్ సాయం కూడా తీసుకున్నారు. అయితే రాహుల్ ఇంటి నుండి బయటికి వచ్చిన  క్రిస్టీనాపై దాడి చేసి ఆమె మెడకు తాడును బిగించి ప్రాణాలు తీశాడు. ఆ తరువాత  క్రిస్టీనా కారులోనే మృతదేహాన్ని హిమాయత్ సాగర్ సమీపంలోని పొదల్లో పడేశాడు. అనంతరం క్రిస్టీనా ఇంట్లో కొన్ని వస్తువులను తీసుకోని అక్కడి నుండి పారిపోయాడు.
మరుసటిరోజు రోమా క్రిస్టీనా ఖాతా నుంచి రూ. 2 లక్షలు తన ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంది. అయితే క్రిస్టీనా కనిపించకుండా పోవడంతో ఆమె కూతురు మేరీ సొలాంగ్, అల్లుడు ప్రశాంత్‌ రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాపు చేపట్టారు. ఈ నేపథ్యంలో రోమా ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: