కొడుకు శవాన్ని 3 రోజులు ఇంట్లో పెట్టుకొని.. తల్లి ఏం చేసిందో తెలుసా?

praveen
మృత్యువు ఎప్పుడు ఎవరి తలుపు తడుతుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. అనుకోని విధంగా మృత్యువు కబళించి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటుంది.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఇంట్లో తల్లీ కొడుకులిద్దరూ ఉంటున్నారు. ఇక వారికి ఎవరూ లేకపోవడంతో తల్లికి కొడుకు.. కొడుక్కి తల్లి అనే విధంగా జీవనం సాగిస్తున్నారు. ఇక వారి జీవనం కాస్త సాఫీగానే సాగిపోతోంది. కానీ వారిని చూసి విధి ఓర్వ లేక పోయింది. ఇక ఇంట్లో ఒకరిని దూరం చేయాలి అనుకుంది. చివరికి  ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడిని మృత్యువు కబళించింది.

 చేతికొచ్చిన కొడుకు మంచి  ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే చివరికి నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ తల్లి గుండె పగిలిపోయింది.  ఇక కొడుకు నిద్రలోంచి ఎంత లేపినా లేకపోవడంతో తల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇక చుట్టుపక్కల వాళ్ళకి చెబితే తన కొడుకుని తీసుకుని స్మశానంలో పూడ్చి పెడతారు అని భయపడి కొడుకు శవాన్ని ఇంట్లోనే పెట్టుకొని మూడు రోజులపాటు విలపిస్తూ వచ్చింది. కానీ దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన నెల్లూరు పత్తి ఖాన్ పేట తామర వీధిలో వెలుగులోకి వచ్చింది.

 వెంకట రాజేష్ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే విభేదాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రాజేష్ అతని తల్లి విజయలక్ష్మి ఎంతగానో మానసికంగా కుంగిపోయారు. అయితే ఇటీవలే తనను ఆలస్యంగా నిద్ర లేపాలి అని తల్లికి చెప్పిన రాజేష్ నిద్ర పోయాడు. కానీ తర్వాత రోజు ఉదయం ఎంత లేపిన అతడిలో కదలిక మాత్రం లేదు. దీంతో కుమారుడు మృతి చెందాడు అన్న విషయాన్ని గ్రహించింది తల్లి. ఇక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా కుమారుడి మృతదేహం వద్ద కుప్పకూలిపోయి రోధిస్తుంది. మూడు రోజులు గడిచిపోయాయి. శవం నుంచి వాసన రావడం మొదలైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా రాజేష్ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: