శవాలపై చిల్లర ఏరుకుంటున్న కార్పోరేట్ ఆసుప‌త్రులు

N.V.Prasd
కరోనా పేరుతో కార్పోరేట్ ఆసుపత్రులు కాసులకు కక్కుర్తిపడుతున్నాయి.చనిపోయిన తరువాత శవాలను సైతం వదలకుండా చిల్లర ఏరుకుంటున్నారు.కరోనా మహామ్మారితో సామాన్యులు విలవిల్లాడుతుంటే ఆసుపత్రులు మాత్రం అందినకాడికి దోచుకునేందుకు చుస్తున్నాయి.అధిక ఫీజులు వసూళ్లు చేసే కార్పోరేట్ ఆసుపత్రులను సీజ్ చేస్తామంటూ ప్రభుత్వం పదే పదే చెప్తుంది తప్ప ఆచరణలో మాత్రం ఎక్కడా అమలవ్వని పరిస్థితి ఏర్పడింది.రాజ‌కీయ నాయ‌కుల అండ‌దండ‌ల‌తో కార్పోరేట్ ఆసుపత్రుల యాజ‌మాన్యాలు మ‌రింత రెచ్చిపోతున్నాయి.

హైదరాబాద్ యశోదా అసుపత్రిలో ఏప్రిల్  13 వతేదీన పురుషోత్తమ్యాదవ్ అనే వ్యక్తి తో చేరార.అయితే డాక్టర్ల  నిర్లక్ష్యం కారణంగా తన తండ్రి మరణించాడని కుమారుడు ప్రవీణ్ యాదవ్  హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు.తన తండ్రి  కారణమైన య‌శోద ఆసుప‌త్రి యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.29 రోజులుగా ఆసుప‌త్రిలో ట్రీట్‌మెంట్ పేరుతో 22 ల‌క్ష‌లు వ‌సూలు చేశార‌ని..అయిన త‌న తండ్రి ప్రాణాలు ద‌క్క‌లేద‌ని ప్ర‌వీణ్ రోదించాడు.త‌న తండ్రి మృత‌దేహాని ఇవ్వాల‌ని ఆసుప‌త్రి సిబ్బందిని కోరితే మిగిలిన ఆరుల‌క్ష‌ల 80వేల రూపాయ‌లు క‌డితేనే ఇస్తామ‌న్నార‌ని తెలిపారు.అడ్మిట్ అయిన మూడు రోజులు ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేదని... రెమిడీసీవీర్ లాంటి ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో క్రిటికల్ కండిషన్ కి వెళ్లారని తెలిపారు. తన తండ్రికి ట్రీట్మెంట్ చేయడం లేదని  రాత  పూర్వకంగా  రాసి పంపించానని వారి, నిర్లక్ష్యాన్ని ప్రశ్నించగా ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


వైద్యం అందించడంలో డాక్టర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కనీసం ప్రాణం రక్షించేందుకు ఎటువంటి మెడిసిన్ ఇవ్వలేదని అని ఆయన ఆరోపించారు సకాలంలో సరైన వైద్యం అందించకపోవడం వలన తన తండ్రి మరణించాడని ఆయన అన్నారు దీనికి బాధ్యులైన డాక్టర్లు  , యాజమాన్యంపై కఠిన చర్యలు  తీసుకోవాలని ప్రవీణ్ యాదవ్ డిమాండ్ చేశారు.య‌శోద ఆసుప‌త్రిపై గ‌తంలో ఇలాంటి ఆరోప‌ణ‌లు చాలా వ‌చ్చాయి.చాలా మంది రోగుల బంధువులు ఫిర్యాదు చేసిన ఈ ఆసుప‌త్రిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: