దారుణం : కామంతో ఊగిపోయిన కరోనా రోగి.. ఏకంగా క్వారంటైన్ సెంటర్లోనే..?

praveen
రోజు రోజుకి కామాంధుల ఆకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో ఊగిపోయి మీదపడి  అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వారి తీరులో  మాత్రం మార్పు రావడంలేదు. అత్యాచారాలకు పాల్పడితే కఠిన శిక్ష పడుతుంది అని వారిలో ఎక్కడ భయం మాత్రం కనిపించడం లేదు. కామంతో ఊగిపోయి కామవాంఛ  తీర్చుకోవడమే లక్ష్యంగా పశువుల్లా  ప్రవర్తిస్తూ మీద పడి పోతున్నారు. దీంతో రోజురోజుకీ మహిళల జీవితం ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. బయట తిరిగినా,  చదువుకోవడానికి వెళ్లినా,  ఇంట్లో ఉన్న ప్రతి చోట ఆడపిల్లలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే.



క్వారంటైన్  సెంటర్లో కూడా ఆడ పిల్లలకు కనీస రక్షణ లేకుండా పోయింది. కరోనా  సోకి క్వారంటైన్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్న ఆడ పిల్లలు సైతం కామందుల బారిన పడుతూ  ఉండడం మరింత సంచలనం గా మారిపోయింది. తాజాగా ఓ బాలిక క్వారంటైన్ కేంద్రంలో చికిత్స పొందుతుండగా ఓ యువకుడు బాలికపై కన్నేసి అతి దారుణంగా.. బాలికపై బాత్రూంలోని అత్యాచారానికి ఒడిగట్టాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ఓ 14 ఏళ్ళ బాలికకు కరోనా  పాజిటివ్ అని వచ్చింది.దీంతో  అధికారులు చెత్తార్ పూర్ లో ఉన్న సర్దార్ పటేల్ క్వారంటైన్ కేంద్రంలో కి తరలించి చికిత్స అందిస్తున్నారు.


 ఇక అదే క్వారంటైన్ కేంద్రంలో కరోనా సోకిన ఓ యువకుడు చికిత్స తీసుకుంటున్నాడు. క్వారంటైన్ లో ఉంటూ కరోనా  వైరస్ మహమ్మారి గురించి ఆందోళన చెందుతూ ఎలా బయట పడాలి అని ఆలోచించాలి గానీ... క్వారంటైన్  సెంటర్లో కూడా తన కామ బుద్ధుని బయటపడ్డాడు యువకుడు. 14 ఏళ్ల బాలిక పై కన్నేశాడు. ఎలాగైనా కామ వాంఛ తీర్చుకోవాలని  సమయం కోసం ఎదురు చూసాడు. ఈనెల 15వ తేదీన రాత్రి సమయంలో బాలిక కాలకృత్యాల కోసం బాత్రూంకి వెళ్ళగా అదే అదనుగా భావించిన యువకుడు తన స్నేహితుడితో  కలిసి... బాలికను బాత్రూం లోనే బంధించి అక్కడే దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఈ ఘటన సంచలనంగా మారగా  రంగంలోకి దిగిన పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశారు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: