రుచికరమైన పాలక్ పరాఠా ఎలా చెయ్యాలో తెలుసుకోండి...
పాలక్ పరాఠా తయారు చేయు విధానం...
ప్రధాన పదార్థం...
రెండు వందల గ్రాములు పాలకూర
మూడు కప్ ల మైదా
ప్రధాన వంటకానికి
రెండు టీ స్పూన్ నెయ్యి
ముద్దలా చేయుటకు...
రెండు టీ స్పూన్ సోపు
అవసరాన్ని బట్టి ఉప్పు
ఒక కప్ పాలు
పాలకూర ని తీసుకోని మిక్సీ లో వేసుకొని ప్యూరీని చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి.
ఒక గిన్నెను తీసుకోని అందులో గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు, వాము, నెయ్యి మరియు ఇంతకముందు చేసి పెట్టుకున్న పాలక్ ప్యూరీ ని వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి మెత్తగా ఇంకా రుచిగా ఉండటానికి కొంచెం పాలను పిండిలో పోసుకొని కలుపుకోండి.
పిండిని చిన్న-చిన్న ముద్దలుగా చేసుకువాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి అలాగే కొద్దిగా గోధుమ పిండిని చల్లాలి..
ఇప్పుడు వాటిని గోధుమ పిండిలో ముంచి తీసి అద్దుకుంటూ పరాఠాల్లాగా చేసుకోవాలి.
తవ్వాని తీసుకోని వేడిచేయండి. తవ్వా వేడి అయ్యాక, పరాఠాలని తవ్వా మీద వేసుకొని రెండువైపులా సమంగా కాలేలాగా చూసుకోవాలి. కొద్దిగా నెయ్యిని రెండు వైపులా వేసి కలిస్తే పరాఠాలు మెత్తగా ఉంటాయి.