ఇదెక్కడి విచిత్రం.. 100కు 138 మార్కులొచ్చాయి?
దీంతో ఇక అటు సోషల్ మీడియాలో కూడా ఇంటర్ ఫలితాల గురించి చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు కొంతమంది ఫెయిల్ అయ్యాము అనే బాధతో సూసైడ్ చేసుకోవడంతో ఇక ఇలాంటి వార్తలు కూడా తెరమీదికి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం కనీ విని ఎరుగనిది. ఇలాంటి విచిత్రమైన ఘటన కూడా జరుగుతుందా అని ప్రతి ఒక్కరికి విషయం తెలిసిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు వందకి వంద మార్కులు సాధించిన విద్యార్థులను చూసాం. కానీ ఇక్కడ ఒక విద్యార్థి మాత్రం అంతకంటే గ్రేట్.
ఎందుకు అంటారా.. ఇక్కడ ఒక విద్యార్థి 100కు 100 మార్కులు సాధించడం కాదు.. 138 మార్కులను సంపాదించింది. ఇలా తమిళనాడు ఇంటర్ ఫలితాలు విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యంతో మధురై కి చెందిన ఓ విద్యార్థికి వందకి 138 మార్కులు వచ్చాయి. మొత్తం 600 మార్కులకు గాను 514 మార్కులు వచ్చిన.. ఇక నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ ఘటన సంచలనంగా మారగా విద్యార్థి పేరెంట్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు. మరోవైపు దిండికల్ కు చెందిన నందిని కి 600కు 600 మార్కులు వచ్చాయి అనే విషయం తెలిసిందే.