మళ్లీ అదే మరణం.. అందరిలో భయం భయం?

praveen
మనిషి జీవితం ఇంతేనా అని ప్రతి ఒక్కరికి అనిపించె ఘటనలు నేటి రోజుల్లో తరచూ వెలుగు లోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో సంతోషం గా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉన్నవారు చూస్తూ చూస్తుండ గానే క్షణాల వ్యవధి లో కళ్ళ ముందే కుప్పకూలి పోయి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణాలు తీసే కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇక సడన్ హార్ట్ ఎటాక్ ఘటనలు ప్రతి ఒక్కరిలో ప్రాణభయా అని పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 వెరసి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రాణం ఏ క్షణంలో పోతుందో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. ఇక ఇలాంటి సడన్ హర్ట్ ఎటాక్లకు సంబంధించిన ఘటనలు అయితే తరచూ సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అప్రమత్తమయ్యి ఆసుపత్రికి తరలించే లోపే చివరికి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగు చూసింది.

 చౌటుకూరు మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పని చేస్తూ ఉంటుంది పద్మలత. ఇటీవలే సడన్ హార్ట్ ఎటాక్ తో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అప్పటివరకు ఎంతో ఎనర్జీతో పిల్లలకు పాఠాలు చెప్పిన ఆమె క్లాస్ రూమ్ నుంచి బయటకు మంచినీళ్లు తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మిగతా సిబ్బంది గమనించి ఆమెనూ ఆస్పత్రికి తీసుకువెళగా పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే అప్పటివరకు కళ్ళ ముందు ఎంతో హుషారుగా ఉన్న సహోద్యోగి ఆకస్మిక మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు మిగతా టీచర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: