వయసు 13 ఏళ్లే.. కానీ గుండెపోటు ప్రాణం తీసింది?

praveen
మనిషి జీవితం ఇంతేనా అని ప్రతి ఒక్కరికి అనిపించేలా ఎన్నో ఘటనలు నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్నాయి. ముఖ్యం గా నేటి రోజుల్లో సడన్ హార్ట్ ఎటాక్ లు అయితే ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే కరోనా వైరస్ రూపం లో ఒక ప్రాణాంతకమైన వైరస్ దూసుకు వచ్చి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఇక ఈ వైరస్ పంజా విసిరిన సమయంలో అరచేతిలో ప్రాణాలు పట్టుకుని అందరూ బిక్కు బిక్కుమంటూ రోజులు లెక్క పెట్టుకున్నారు.

 అయితే ఈ వైరస్ ప్రభావం తగ్గింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇక ఇప్పుడు సడన్ హార్ట్ ఎటాక్ లు చూస్తూ చూస్తుండగానే మనిషి ప్రాణాలను సెకండ్ల వ్యవధిలో తీసేస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా సడెన్ హార్ట్ ఎటాక్లతో చనిపోతున్నారు. దీంతో ఎప్పుడు ప్రాణం పోతుందో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది మనిషి జీవితం. ఇక ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని పలనాడు జిల్లాలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 ఏకంగా 8వ తరగతి విద్యార్థి సడన్ హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సీ హాస్టల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు కోటిస్వాములు అనే 13 ఏళ్ల విద్యార్థి. ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. రాత్రి భోజనం చేశాక ఊపిరాడటం లేదని స్నేహితులతో చెప్పిన బాలుడు.. కాసేపటికే  కుప్పకూలిపోయాడు. వెంటనే బాలుడిని వార్డెన్ ఆసుపత్రికి తరలించిగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడు అన్న వార్త ఆ తల్లిదండ్రులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అరణ్య రోదనగా విలపించారు అని చెప్పాలి. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: