కోడలిపై కన్నేసిన మామ.. ఓ రోజు కొడుకు బయటకెళ్లడంతో?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషుల మధ్య మానవ బంధాలకు అసలు విలువ లేకుండా పోయింది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే వావి వరసలు మరిచి కేవలం క్షణకాల సుఖం కోసం ఎంతోమంది దారుణాలకు పాల్పడుతున్నారు. ఏకంగా మానవ బంధాలను మరిచిపోయి నీచంగా ఆలోచిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇక్కడ సభ్య సమాజం తలదించుకునే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కొడుకుకి భార్యగా ఇంటికి కోడలిగా వచ్చిన యువతిని కన్న కూతురులా చూసుకోవాల్సిన మామ కామంతో ఊగిపోయాడు.

 చివరికి ఏదో ఒక రోజు కోడలని దక్కించుకోవాలని పాడు ఆలోచన చేశాడు. ఈ ఘటన రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. రతన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడలిపై కన్నేసిన మామ ఆమెపై అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచాడు. వివరాల్లోకి వెళితే బాధితురాలికి సర్దార్షహర్ గ్రామానికి చెందిన యువకుడుతో వివాహం జరిగింది. ఒక రాత్రి ఆమె బాత్రూం కి వెళ్ళింది. అదే సమయంలో ఆమె వెళ్లడం మామ చూశాడు. ఇక ఆ సమయంలో కొడుకు ఏదో పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు మామ.

 మామ బాత్రూంలోకి రావడంతో ఒక్కసారిగా యువతి షాక్ అయింది. వెంటనే భయపడి కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో తన వెంట తెచ్చుకున్న కత్తిని బయటకు తీస్తాడు నిందితుడు. అరిస్తే చంపేస్తానంటూ బెదిరించాడు. ఇక బాత్రూం లోనే ఆమెను అత్యంత క్రూరంగా అనుభవించి ఆ తర్వాత బయట నుంచి గడియ పెట్టి పారిపోయాడు. బాధితురాలు తేరుకొని అత్తకు జరిగిన విషయం చెప్పింది. ఇక ఆ సమయంలోనే మామ విక్రమ్ కూడా అక్కడికి వచ్చి కోడలు అబద్ధం చెబుతుందంటూ ఇక అత్తమ్మలు ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో బెదిరింపులు తట్టుకోలేక బాధితురాలు పుట్టింటికి వెళ్ళింది. చివరికి రతన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా బాధితురాలికి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: