రెచ్చిపోయిన కుక్కలు.. ఆస్పత్రి నుంచి శిశువును ఎత్తుకెళ్లి?

praveen
ఇటీవల కాలంలో మనుషులకి కుక్కలకి మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతోమంది ఇష్టంగా కొన్ని కుక్కలను తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళ లాగానే ఇక ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా ఒకవైపు మనిషికి కుక్కలకి మధ్య బంధం బలం ఇంకా మారుతూ ఉంటే.. మరోవైపు మాత్రం వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ కుక్కలపై ఉన్న ఇష్టాన్ని పూర్తిగా చంపేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏకంగా కుక్కలు దారుణంగా మనుషుల ప్రాణాలను తీసేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్.

 దీంతో ఎక్కడైనా వీధి కుక్క కనిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరి గుండె జారిపోయినంత పని అవుతుంది. ఇక అటువైపుగా వెళ్లడానికి కూడా ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు అని చెప్పాలి. అయితే మొదటికే మొన్న హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ ని కుక్కలు దారుణంగా చంపేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. అయితే ఈ ఘటన గురించి మరవకముందే తెలంగాణలోనే మరికొన్ని కుక్కల దాడికి సంబంధించిన ఘటనలు వెలుగు చూసాయ్.

 అయితే తెలంగాణలో మాత్రమే కాదు దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో సైతం ఇలా కుక్కల బెడద తీవ్రంగానే ఉంది అన్నది అర్థమవుతుంది. మొన్న అంబర్పేట్ లో జరిగిన ఒక దారుణమైన ఘటనలాంటిదే ఇక ఇప్పుడు రాజస్థాన్లో కూడా జరిగింది. ఏకంగా ఒక నెల వయసున్న పసికందును వీధి కుక్కలు అత్యంత కిరాతకంగా కరిచి చంపేసాయి. సిరోహి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరు లేని సమయంలో తల్లి పక్కన పడుకున్న ఆడ శిశువును ఏకంగా రెండు కుక్కలు ఎత్తుకు వెళ్లాయి. ఇక రాత్రి రెండు గంటల సమయంలో తల్లి నిద్ర నుంచి మెలకువ వచ్చి చూసేసరికి కూతురు కనిపించలేదు. బయటికి వచ్చి చూస్తే.. కుక్కలు కరుస్తూ ఉండడం కనిపించింది. వెంటనే ఆ కుక్కలను అక్కడ నుంచి తరిమేసిన అప్పటికే తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: