అగ్గిపెట్టె.. బాలుడి ప్రాణం తీసింది?

praveen
ఒకసారి తల్లి కడుపు నుంచి భూమ్మీదకి వచ్చిన తర్వాత మనిషిని మృత్యువు ఎప్పుడు కబలిస్తుంది అన్నది చెప్పలేని విధంగానే ఉంటుంది అని చెప్పాలి. సాధారణంగా ఇలా భూమ్మీదికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాదాపు 70 ఏళ్ళు బ్రతికేస్తాం అని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం అనుకోని విధంగా మృత్యువు దూసుకు వచ్చి కబళిస్తూ ఉంటుంది. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కుటుంబంలో విషాదం నిండిపోతు  ఉంటుంది అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఎన్నో ఘటనలు చూసిన తర్వాత మనిషి ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోయింది అన్నది అర్థమవుతుంది.

 చత్తీస్గడ్ లోని కొర్యాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా ఒక అగ్గిపెట్టె బాలుడు ప్రాణం పోవడానికి కారణమైంది. బాలుడు ఆడుకుంటూ తెలిసి తెలియక చేసిన పని కాస్త చివరికి అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేసింది అని చెప్పాలి. ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. ఏకంగా అగ్గిపెట్టతో ఆడుకుంటూ పక్కనే ఉన్న గడ్డికి నిప్పు పట్టించాడు. దీంతో మంటలు ఒక్కసారిగా బగ్గు మన్నాయి. ఇక ఆ మంటల్లో చిక్కుకొని బాలుడు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు.

 ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు సదరు చిన్నారి తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే అక్కడ అతని కంటికి ఒక అగ్గిపెట్ట కనిపించింది. ఇక ఆ అగ్గిపెట్ట చేతిలో పట్టుకుంటూ ఆడుకుంటున్నాడు. అయితే ఇలాంటి సమయంలోనే పక్కనే నిర్మాణంలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళాడు. ఇక ఆ ఇంట్లో పశువుల మేత కోసం గడ్డిని నిల్వ ఉంచారు అని చెప్పాలి. అయితే అగ్గిపెట్టతో ఆడుకుంటున్న బాలుడు చివరికి పొరపాటున గడ్డికి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి  చిన్నారి మంటలు చిక్కుకున్నాడు. అయితే బాలుడు ఏడుపు విన్న తల్లి పరిగెత్తుకుంటూ వెళ్లి కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే తీవ్ర కాలిన గాయాలు కావడంతో చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: