నిత్య పెళ్లి కూతురు.. 15 మందిని పెళ్లి చేసుకుని?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఒంటరిగా సాగిపోతున్న జీవితానికి ఒక తోడును జోడించి ఇక జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశతో ప్రతి ఒక్కరు కూడా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతూ ఉంటారు. ఇక పెళ్లి చేసుకునే ముందు అన్ని విషయాలను వెనుక ముందు ఆలోచించి ఇక ముందు అడుగు వేస్తూ ఉంటారు అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా తమను అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే చాలు అని ఆశ పడుతూ ఉంటారు.

 యువతి యువకులు అందరూ కూడా ఇలా పెళ్లి అనే విషయాన్ని ప్రత్యేకమైనదిగానే చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ అలా కాదు పెళ్లి ఆమె జీవితంలో ఒకసారి జరిగే ఒక ప్రత్యేకమైన ఘట్టం కాదు. ఏకంగా నిత్యం జరిగే డైలీ సీరియల్ లాంటిది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆమె ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 15 మందిని వివాహం చేసుకుంది. అయితే పెళ్లిళ్లు చేసుకునేది కేవలం మోసం చేయడానికి మాత్రమే అని చెప్పాలి. కడలూరు జిల్లా బన్ రోటి సమీపంలో వానియం పాలయం గ్రామానికి చెందిన అరుల్ రాజ్ చెరుకు కార్మికుడు.

 అయితే సదరు వ్యక్తికి ఫేస్బుక్లో ఒక యువతి పరిచయమైంది. కాగా వివాహం కూడా చేసుకున్నాడు. మొదట్లో వీరి జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది. అయితే అరుల్ రాజు  పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో భార్య ఒంటరిగా ఉండలేనని బంధువుల ఇంటికి వెళ్తానంటూ వెళ్లి వస్తూ ఉండేది. అయితే మూడు నెలల క్రితం  తన చెల్లి పెళ్లి కోసం ఏడు సవర్ల నగలు 90 వేల నగదు ఇంట్లో పెట్టాడు. ఆ డబ్బులు తీసుకొని అతని భార్య చెక్కేసింది. ఇక అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విచారణలో అరుల్ ను వివాహం చేసుకున్న మహిళ బేలూరు, కోయంబత్తూరు, తిరువన్నామలై ప్రాంతాలలో ఏకంగా 15 మంది యువకులను వివాహం చేసుకొని మోసగించినట్లు తెలుస్తోంది. గతంలో బాధితులు వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: