బాలింత మృతి.. శవం పక్కనే నిమ్మకాయలు, పసుపు కుంకుమ?

praveen
దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కూడా ఇంకా కొన్ని ప్రాంతాలలో మూఢనమ్మకాల పేరుతో జరుగుతున్న దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్ముతున్న ఎంతోమంది చివరికి అనాగరికత జీవితంలోని బ్రతికేస్తూ ఉన్నారు. ఇక ఏదైనా అనారోగ్య సమస్య వస్తే డాక్టర్ల దగ్గరికి పరుగులు పెట్టడం కాదు.. బురిడీ బాబాల దగ్గరికి వెళ్లి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.  ఇక మరి కొంతమంది క్షుద్ర పూజల పేరుతో ఏకంగా నర బలులు ఇస్తూ ఉన్న ఘటనలు కూడా ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.

 ఇలా తరచూ ఏదో ఒక ఘటన వెలుగులోకి వస్తు ఇంకా సభ్య సమాజంలో మూఢనమ్మకాలు అనేవి పాతుకుపోయాయి అన్నదానికి నిదర్శనం గా మారిపోతున్నాయి అని చెప్పాలి.. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. గత కొన్ని రోజుల క్రితం ఒక మహిళ అదృశ్యమైంది. అయితే ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా అదృశ్యమైన మహిళ చివరికి చెరువులో శవమై తేలింది.

 ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో వెలుగు చూసింది అని చెప్పాలి. ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన అవంతిక అనే బాలింత చివరికి చెరువులో శివమై తేలింది. అయితే పౌర్ణమి ఆదివారం కావడం.. ఇక అర్ధరాత్రి అవంతిక ఒంటరిగా వెళుతున్న వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడం సంచలనంగా మారిపోయింది. అదే సమయంలో డెడ్ బాడీ లభించిన చోట నిమ్మకాయలు పసుపు కుంకుమ కూడా లభించడంతో క్షుద్ర పూజల కారణంగానే ఆమె చనిపోయిందని గ్రామస్తులందరూ కూడా భయాందోళనలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: